News May 26, 2024
కౌంటింగ్ ఏజెంట్లుగా ఎవరికి అనుమతి లేదు?

✒ గన్మెన్లు ఉన్న వ్యక్తులు, మంత్రులు, MPలు, MLAలు, మేయర్లు, మున్సిపల్, ZP ఛైర్మన్లు, ప్రభుత్వ-ఎయిడెడ్ సంస్థల్లో పనిచేసేవారు, GOVT గౌరవ వేతనం పొందేవారు, రేషన్ డీలర్లు, అంగన్వాడీ ఉద్యోగులు ఏజెంట్లుగా కూర్చోకూడదు.
✒ ప్రభుత్వ ఉద్యోగులు ఏజెంట్లుగా వ్యవహరించినట్లు తేలితే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం శిక్షార్హులవుతారు.
✒ 3 నెలల జైలు శిక్ష లేదా ఫైన్, ఒక్కోసారి రెండూ కలిపి విధించే అవకాశం ఉంది.
Similar News
News December 22, 2025
తండ్రైన భారత క్రికెటర్

టీమ్ ఇండియా క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ దంపతులు మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ‘బేబీ బాయ్కి స్వాగతం. 9 నెలలుగా నీ రాక కోసం ఎదురుచూస్తున్నాం’ అంటూ రాసుకొచ్చారు. కాగా 2023 ఫిబ్రవరి 27న మిథాలీ పారూల్కర్ను శార్దూల్ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం జాతీయ జట్టులో చోటు కోల్పోయిన ఆయన దేశవాళీ క్రికెట్లో ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
News December 21, 2025
అల్లుడి చేతిలోకి పార్టీ పోతుందనే భయంతో..: సీఎం

TG: కేసీఆర్ తన కొడుకు కోసమే బయటికి వచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘కేసీఆర్ చస్తే హరీశ్ రావు పార్టీని తన చేతుల్లోకి తీసుకోవాలని చూస్తున్నారు. అల్లుడి చేతుల్లోకి పార్టీ పోతుందనే భయంతోనే కేసీఆర్ బయటకు వచ్చారు. కేసీఆర్, కేటీఆర్ రాష్ట్రాన్ని ఆర్థికపరంగా అత్యాచారం చేశారు. కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాది. అన్ని ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా మార్పు రావడం లేదు’ అని చిట్చాట్లో విమర్శించారు.
News December 21, 2025
రాష్ట్రపతి భవన్లో ఎట్ హోం.. హాజరైన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు

శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో జరిగిన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాదరావు, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు.


