News May 26, 2024
కౌంటింగ్ ఏజెంట్లుగా ఎవరికి అనుమతి లేదు?

✒ గన్మెన్లు ఉన్న వ్యక్తులు, మంత్రులు, MPలు, MLAలు, మేయర్లు, మున్సిపల్, ZP ఛైర్మన్లు, ప్రభుత్వ-ఎయిడెడ్ సంస్థల్లో పనిచేసేవారు, GOVT గౌరవ వేతనం పొందేవారు, రేషన్ డీలర్లు, అంగన్వాడీ ఉద్యోగులు ఏజెంట్లుగా కూర్చోకూడదు.
✒ ప్రభుత్వ ఉద్యోగులు ఏజెంట్లుగా వ్యవహరించినట్లు తేలితే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం శిక్షార్హులవుతారు.
✒ 3 నెలల జైలు శిక్ష లేదా ఫైన్, ఒక్కోసారి రెండూ కలిపి విధించే అవకాశం ఉంది.
Similar News
News December 25, 2025
నష్టాల నుంచి సక్సెస్ వైపు అడుగులు

తొలి ప్రయత్నంతో నష్టంతో ఉదయ్ కుంగిపోలేదు. కృషి విజ్ఞాన కేంద్రం, యూట్యూబ్ నుంచి డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్, అంతర పంటల సాగు, హైబ్రిడ్ వెరైటీలను ఆధునిక పద్ధతుల్లో పెంచడంపై శిక్షణ పొందారు. ప్రధాన మంత్రి కృషి సంచాయీ యోజన కింద డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి 90% సబ్సిడీ వచ్చింది. దీంతో డ్రిప్, మల్చింగ్ ఏర్పాటు చేసి 20 ఎకరాల్లో మిరప, టమాటా, క్యాబేజీ, బఠాణీ, ఇతర కూరగాయల పంటల సాగు చేపట్టారు.
News December 25, 2025
పోలవరానికి గోదావరి పుష్కరాలే టార్గెట్: PPA సీఈవో

AP: పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని PPA సీఈవో యోగేశ్ స్పష్టం చేశారు. పునరావాస గ్రామాల్లో పర్యటించి మౌలిక వసతులు, పరిహారంపై ఆరా తీశారు. అనంతరం ప్రాజెక్టు వద్ద డయాఫ్రంవాల్, బట్రస్ డ్యామ్, కుడి, ఎడమ కాలువ పనులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాల నాటికి పనులను పూర్తిచేసే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించుకుని ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు.
News December 25, 2025
రోజూ రూ.15 వేలు.. మిరప నుంచే రూ.10 లక్షలు

మొత్తం 20 ఎకరాలకుగాను ఉదయ్ కుమార్ 4 ఎకరాల్లో మిరప, 6 ఎకరాల్లో టమాటా, 1 ఎకరంలో క్యాబేజి, అర ఎకరంలో బఠాణీ పండిస్తున్నారు. మిగిలిన భూమిలో ఆకుకూరలు, కూరగాయలను సాగు చేస్తున్నారు. కేవలం మిరప పంట ద్వారానే ఈ ఏడాది ఇప్పటి వరకు 21 టన్నుల దిగుబడిని సాధించి రూ.10 లక్షలకు పైగా ఆదాయాన్ని పొందారు. ఇలా మిరప సహా ఇతర పంటల నుంచి రోజూ రూ.10వేలు నుంచి రూ.15వేలు ఆదాయం పొందుతూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఉదయ్.


