News May 26, 2024

కౌంటింగ్ ఏజెంట్లుగా ఎవరికి అనుమతి లేదు?

image

✒ గన్‌మెన్లు ఉన్న వ్యక్తులు, మంత్రులు, MPలు, MLAలు, మేయర్లు, మున్సిపల్, ZP ఛైర్మన్లు, ప్రభుత్వ-ఎయిడెడ్ సంస్థల్లో పనిచేసేవారు, GOVT గౌరవ వేతనం పొందేవారు, రేషన్ డీలర్లు, అంగన్‌వాడీ ఉద్యోగులు ఏజెంట్లుగా కూర్చోకూడదు.
✒ ప్రభుత్వ ఉద్యోగులు ఏజెంట్లుగా వ్యవహరించినట్లు తేలితే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం శిక్షార్హులవుతారు.
✒ 3 నెలల జైలు శిక్ష లేదా ఫైన్, ఒక్కోసారి రెండూ కలిపి విధించే అవకాశం ఉంది.

Similar News

News January 17, 2026

ఇరాన్ నుంచి వెెనుదిరుగుతున్న భారతీయులు

image

అంతర్గత నిరసనలు, మరోపక్క USతో యుద్ధవాతావరణం నేపథ్యంలో ఇరాన్‌లోని భారతీయ పౌరులు వెనక్కి వస్తున్నారు. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నందున ఇరాన్‌కు ప్రయాణాలు మానుకోవాలని అక్కడి ఇండియన్ ఎంబసీ ఇప్పటికే హెచ్చరించింది. ఆ దేశంలో 9000 మంది భారతీయులుండగా వీరిలో విద్యాభ్యాసం కోసం వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారని పేర్కొంది. కమర్షియల్ విమానాలు ప్రస్తుతం తిరుగుతున్నందున ఇరాన్ వీడి వెళ్లడం మంచిదని సూచించింది.

News January 17, 2026

యాదగిరిగుట్ట ఈవోగా భవానీ శంకర్

image

TG: రాష్ట్రంలో పలువురు IASలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఈవోగా భవానీ శంకర్(నాన్ క్యాడర్)ను నియమించింది. మొన్నటి వరకు ఈవోగా ఉన్న వెంకట్రావు అనారోగ్య కారణాలతో రాజీనామా చేశారు. ఇక ఆసిఫాబాద్ కలెక్టర్‌గా కె.హరిత, ఫిషరీస్ డైరెక్టర్‌గా కె.నిఖిల, విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీగా వెంకటేశ్ ధోత్రేను సర్కార్ బదిలీ చేసింది.

News January 17, 2026

ఇండిగో సంక్షోభం.. భారీ జరిమానా విధించిన DGCA

image

వందల <<18481260>>విమానాల రద్దు<<>>, వాయిదాలతో ప్రయాణికులను ఇండిగో ముప్పుతిప్పలు పెట్టిన విషయం తెలిసిందే. డిసెంబర్‌లో కొన్ని రోజులపాటు కొనసాగిన ఈ సంక్షోభంపై DGCA ఇవాళ చర్యలు తీసుకుంది. ఇండిగోకు రూ.22.2 కోట్ల జరిమానా విధించింది. అలాగే రూ.50 కోట్ల బ్యాంకు గ్యారంటీలను సమర్పించాలని ఆదేశించింది. రాబోయే నెలల్లో తనిఖీలు చేసి దశలవారీగా ఆ డబ్బు రిలీజ్ చేస్తామని చెప్పింది. ఇంప్రూవ్‌మెంట్ చూపించాలని స్పష్టం చేసింది.