News March 8, 2025
ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’కు నామినీలు ఎవరంటే..

ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ప్రతి నెలా అత్యుత్తమ ఆటగాళ్లకు ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ పురస్కారం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరికి గిల్, స్టీవ్ స్మిత్, గ్లెన్ ఫిలిప్స్ పేర్లను నామినేట్ చేసినట్లు ఐసీసీ ప్రకటించింది. గిల్ గత నెలలో 5 వన్డేలాడి 406 పరుగులు చేశారు. స్మిత్ 2 టెస్టుల్లో 2 సెంచరీలు, 4 వన్డేల్లో 12, 29, 5, 19 రన్స్ చేశారు. ఇక ఫిలిప్స్ 7 వన్డేల్లో ఓ సెంచరీతో కలిపి 318 రన్స్ చేశారు.
Similar News
News November 6, 2025
వాణిజ్య కూడళ్ల సమీపంలో నివాసం ఉండొచ్చా?

బహుళ అంతస్తుల భవనాల సమీపంలో, వాణిజ్య కేంద్రాలు, వ్యాపార కూడళ్లలో నివాసం ఉండడం మంచిది కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తారు. ఈ ప్రాంతాలలో నిరంతర శబ్దం వల్ల అధిక ప్రతికూల శక్తి వస్తుందంటారు. ‘ఇది ఇంటికి శాంతిని, నివాసితులకు ప్రశాంతతను దూరం చేస్తుంది. వ్యాపార కూడళ్ల చంచలత్వం నివాస స్థలంలో స్థిరత్వాన్ని లోపింపజేస్తుంది. శుభకరమైన జీవనం కోసం ఈ స్థలాలకు దూరంగా ఉండాలి’ అని చెబుతారు. <<-se>>#Vasthu<<>>
News November 6, 2025
’FATHI’ ఆరోపణలు అవాస్తవం: ఐఏఎస్లు

TG: విద్యాశాఖ ఇన్ఛార్జి కార్యదర్శి దేవసేనపై ప్రయివేటు కాలేజీల సంఘం(FATHI) <<18207242>>ఆరోపణలు<<>> నిరాధారం, అవాస్తవమని IASల అసోసియేషన్ ఖండించింది. ఫతి ఆరోపణలు ఆమెను తక్కువ చేసేవే కాకుండా సివిల్ సర్వీసెస్ నైతికతను సమగ్రతను దెబ్బతీసేవిగా ఉన్నాయని పేర్కొంది. ఆరోపణలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. విధుల్లో అనేక సవాళ్లు ఎదుర్కొంటూ అంకిత భావంతో పనిచేసే అధికారులపై ఆరోపణలు తగవని హితవు పలికింది.
News November 6, 2025
పెరిగిన ఓటింగ్ శాతం.. ఎవరికి సానుకూలం?

బిహార్లో ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఓటింగ్ పర్సంటేజ్ 57.29శాతం కాగా ఇవాళ జరిగిన ఫస్ట్ ఫేజ్లో సా.5 గంటల వరకే 60.13శాతం పోలింగ్ నమోదైంది. సా.6 గంటల వరకు లెక్కేస్తే ఇది మరింత పెరగనుంది. దీంతో పర్సంటేజ్ పెరగడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తమకే సానుకూలమంటూ JDU-BJP నేతృత్వంలోని NDA, RJD-INC నేతృత్వంలోని మహా గఠ్ బంధన్ కూటములు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.


