News July 17, 2024

చాందీపురా వైరస్ ఎవరికి సోకుతుందంటే?

image

<<13643966>>చాందీపురా<<>> వైరస్ గురించి ఓ వైద్యుడు వివరించారు. ‘చందీపురా అనేది మహారాష్ట్రలోని ఒక గ్రామం. 1965లో ఇక్కడ తొలి కేసు నిర్ధారణ అయింది. జ్వరం, తలనొప్పి, విరేచనాలు దీని లక్షణాలు. కాగా తీవ్రమైన సందర్భాల్లో మూర్ఛ, స్పృహ కోల్పోవడం, మరణం సంభవించవచ్చు. ఇసుక ఈగలు, పేలు, దోమల వల్ల సోకుతుంది. ఇది అంటువ్యాధి కాదు. 9 నెలల – 14 ఏళ్ల పిల్లలపై అధిక ప్రభావం ఉంటుంది. దీనిని నిరోధించేందుకు వ్యాక్సిన్ లేదు’ అని తెలిపారు.

Similar News

News November 25, 2025

కరీంనగర్ జిల్లాలో 3 విడతల్లో ఎన్నికలు

image

KNR జిల్లాలోని 316 పంచాయతీలకు ఎన్నికలను 3 దశలో నిర్వహించనున్నారు. మొదటి దశలో రామడుగు, చొప్పదండి, గంగాధర, కొత్తపల్లి, KNR రూరల్ మండలాల్లోని 92 పంచాయతీలకు నిర్వహించనున్నారు. రెండోదశలో చిగురుమామిడి, తిమ్మాపూర్, గన్నేరువరం, మానకొండూరు, శంకరపట్నం మండలాల్లోని 113 పంచాయతీలకు జరగనున్నాయి. మూడో దశలో వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, హుజురాబాద్, సైదాపూర్ మండలాల్లోని 111 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

News November 25, 2025

కరీంనగర్ జిల్లాలో 3 విడతల్లో ఎన్నికలు

image

KNR జిల్లాలోని 316 పంచాయతీలకు ఎన్నికలను 3 దశలో నిర్వహించనున్నారు. మొదటి దశలో రామడుగు, చొప్పదండి, గంగాధర, కొత్తపల్లి, KNR రూరల్ మండలాల్లోని 92 పంచాయతీలకు నిర్వహించనున్నారు. రెండోదశలో చిగురుమామిడి, తిమ్మాపూర్, గన్నేరువరం, మానకొండూరు, శంకరపట్నం మండలాల్లోని 113 పంచాయతీలకు జరగనున్నాయి. మూడో దశలో వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, హుజురాబాద్, సైదాపూర్ మండలాల్లోని 111 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

News November 25, 2025

మున్సిపల్ వాటర్‌తో బెంజ్ కారు కడిగాడు.. చివరకు!

image

TG: చాలా మంది వాటర్ బోర్డ్ సరఫరా చేసే తాగునీటితోనే యథేచ్ఛగా వాహనాలను కడిగేస్తుంటారు. HYD బంజారాహిల్స్ రోడ్ నం.12లో అలా చేసిన ఓ వ్యక్తికి అధికారులు రూ.10వేల జరిమానా విధించారు. వాటర్ బోర్డ్ ఎండీ అశోక్ రెడ్డి రోడ్డుపై వెళ్తుండగా నీటితో కారు కడగడాన్ని గమనించారు. వెంటనే అతడికి ఫైన్ వేయాలని అధికారులను ఆదేశించారు. తాగునీటిని ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని నగరవాసులను హెచ్చరించారు.