News May 10, 2024

బీజేపీ ఇవ్వకపోతే ఇవన్నీ ఎవరు ఇచ్చారు?: మోదీ

image

తెలంగాణకు కేంద్రం ఇస్తున్న నిధులను కాంగ్రెస్ నేతలు ATMగా మార్చుకున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. ‘4 వందే భారత్ రైళ్లు తెలంగాణకు ఎవరు ఇచ్చారు? తొలి ఎయిమ్స్, ఫర్టిలైజర్స్ పరిశ్రమ, పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ ఎవరు ఇచ్చారు? తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని కాంగ్రెస్ అంటోంది. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ బీజేపీ నినాదం’ అని మోదీ పేర్కొన్నారు.

Similar News

News January 19, 2026

కాంగ్రెస్, BRS, TDP సోషల్ మీడియా వార్.. ఫొటోలు వైరల్

image

TG: BRS దిమ్మెలను కూల్చివేయాలన్న CM రేవంత్ వ్యాఖ్యలతో రాజకీయ పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ మొదలైంది. తెలంగాణ గడ్డపై గాంధీ భవన్, ఎన్టీఆర్ భవన్ లేకుండా చేస్తామంటూ BRS నేతలు పోస్టులు చేస్తున్నారు. వాటిని కూల్చివేసినట్లు AI జనరేటెడ్ ఫొటోలు క్రియేట్ చేశారు. అటు కాంగ్రెస్, TDP నేతలు సైతం BRS పార్టీని, తెలంగాణ భవన్‌ను నేలమట్టం చేస్తామంటూ AI ఫొటోలు పెడుతున్నారు.

News January 19, 2026

పశువుల్లో క్షయ వ్యాధిని ఈ లక్షణాలతో గుర్తించండి

image

పశువుల్లో క్షయ వ్యాధి మైకోబాక్టీరియా వల్ల సోకుతుంది. ఈ వ్యాధి సోకిన పశువులు శ్వాస వదిలినప్పుడు, తుమ్మినప్పుడు.. మైకోబాక్టీరియా గాలిలో కలిసిపోతుంది. ఈ బాక్టీరియాతో కలుషితమైన మేత, నీరు, పాలను తాగడం వల్ల క్షయ వ్యాధి ఇతర పశువులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన పశువులు బరువు తగ్గుతాయి. ముక్కు నుంచి నీరు కారుతుంది. ఈ లక్షణాలు కనిపించిన జీవాలను ఇతర పశువుల నుంచి వేరు చేసి వెటర్నరీ నిపుణులకు చూపించాలి.

News January 19, 2026

కులాన్ని ఉద్దేశించని దూషణ శిక్షార్హం కాదు: SC

image

SC, STలపై కులాన్ని ఉద్దేశించి కాకుండా కేవలం అవమానించేలా చేసే దూషణలు శిక్షార్హమైనవి కావని SC పేర్కొంది. బిహార్‌లో ఓ కేసులో ట్రయిల్ కోర్టు ఇచ్చిన క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ ఆర్డర్‌ను క్వాష్ చేయాలని నిందితుడు వేసిన పిటిషన్‌ను HC డిస్మిస్ చేసింది. కాగా HC ఆర్డర్లు, ప్రొసీడింగ్స్‌ను జస్టిసులు పార్థివాలా, అలోక్ ఆరాధేలు నిలిపివేస్తూ దిగువకోర్టులు SC, ST ACT కింద చర్యలు చేపట్టడంలో విఫలమయ్యాయని అన్నారు.