News November 22, 2024
‘కుర్చీ’ దక్కేదెవరికి? మహారాష్ట్రలో అంతర్గత పోరు!

ఇంకా ఫలితాలే వెలువడలేదు. మహారాష్ట్రలో 2 కూటముల్లో CM కుర్చీ కోసం పోరు మొదలైంది! క్రితంసారి ఏక్నాథ్ శిండేకు అవకాశం ఇవ్వడంతో ఈసారి దేవేంద్ర ఫడ్నవీస్కు పదవి అప్పగించాలని BJP నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సీఎంగా శిండేనే కొనసాగుతారని శివసేన నేతలు అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా రానప్పటికీ కాంగ్రెస్ కూటమి గెలుపు ధీమాతో ఉంది. సీఎం పదవి తమకే వస్తుందని కాంగ్రెస్, శివసేన UBT చెప్పుకుంటున్నాయి.
Similar News
News October 17, 2025
నేలపై కూర్చొని తింటే ఎన్ని లాభాలో..

నేలపై కూర్చొని భోజనం చేసే పవిత్రమైన ఆచారం భారత్లో ఎప్పటి నుంచో ఉంది. దీని వెనుక ఆరోగ్య రహస్యం కూడా ఉంది. మనం నేలపై కూర్చొని తినడం పద్మాసన భంగిమను పోలి ఉంటుంది. ఈ పద్ధతి జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి.. నేలపై కూర్చొని వినయంతో తినడం ఆహారం పట్ల మన గౌరవాన్ని సూచిస్తుంది. ఈ ఆచారాన్ని దైవ ప్రసాదంగా స్వీకరించాలని పండితులు చెబుతున్నారు.
News October 17, 2025
110 పోస్టులకు నోటిఫికేషన్

భారత్ డైనమిక్స్ లిమిటెడ్లో 110 ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, మెషినిస్ట్, వెల్డర్ తదితర ఉద్యోగాలున్నాయి. టెన్త్+సంబంధిత విభాగంలో ITI పాసైనవారు అర్హులు. వయసు 30ఏళ్లలోపు ఉండాలి. దరఖాస్తుకు చివరి తేదీ OCT 30. మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్: <
News October 17, 2025
ఎడారి నేలకు జలకళ తెచ్చిన ‘ఆమ్లా రుయా’

ఎడారికి ప్రాంతమైన రాజస్థాన్లో తాగునీటి కష్టాలు అన్నీఇన్నీ కావు. వీటికి శాశ్వత పరిష్కారం చూపాలని ఆమ్లా రుయా 1998లో ఆకర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా 200 కుంటలు, బావులు, 317 చెక్ డ్యామ్లు నిర్మించారు. వీటితో అక్కడి పేద ప్రజలు ఆర్థికంగా బలోపేతమయ్యేలా కృషిచేసి ఆమె ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ✍️ మహిళల స్ఫూర్తిదాయక కథనాలు, చైల్డ్ కేర్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>> క్లిక్ చేయండి.