News June 4, 2024

2019, 2014 ఎన్నికల్లో ఎవ‌రికి ఎన్ని సీట్లు?

image

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 52 సీట్లకు ప‌రిమిత‌మైంది. 2014లో బీజేపీ 282 స్థానాల్లో గెలిచి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో ఎన్డీయే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ కేవ‌లం 44 సీట్లు ద‌క్కించుకుంది. ఇక 2024 ఎన్నిక‌ల్లో ఎవ‌రికి ఎన్ని సీట్లు ద‌క్కుతాయ‌న్న‌ది మ‌రి కొద్దిసేప‌ట్లో తేల‌నుంది.

Similar News

News October 30, 2025

భక్తిని పెంచే సాధనాలు ‘రుద్రాక్ష, విభూతి’

image

మానవుడు భగవంతునిపై భక్తిని పెంచుకోవడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. రుద్రాక్ష ధారణ ద్వారా ఓ వ్యక్తి నాలుగో వంతు భక్తిని పొందుతాడు. విభూతి ధారణ వల్ల సగ భాగం భక్తి లభిస్తుంది. ఇక మంత్ర జపం చేస్తే మూడు వంతుల భక్తిని సాధించవచ్చు. ఈ పనులన్నింటితో పాటు దేవుడిని పూజిస్తే ఆ వ్యక్తి పూర్ణ భక్తిని పొందుతాడు. పూర్ణ భక్తి లభించిన తర్వాత, దాని అంతిమ ఫలం జన్మ రాహిత్యమే. అంటే మోక్షం పొందడమే అన్నమాట. <<-se>>#SIVOHAM<<>>

News October 30, 2025

నీలి రంగులోకి మారిపోయిన కుక్కలు.. కారణం అదేనా?

image

ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్‌ అణు విద్యుత్ ప్లాంట్‌ సమీపంలో కొన్ని వీధి కుక్కలు నీలి రంగులో ఉండటం ఆశ్చర్యపరుస్తోంది. ఇవి 1986 నాటి అణు ప్రమాదం తర్వాత మిగిలిపోయిన పెంపుడు జంతువుల సంతతికి చెందిన శునకాలుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కాపర్ సల్ఫేట్ వంటి పారిశ్రామిక రసాయనాల వల్లే ఇలా మారిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీని మూలాన్ని గుర్తించడానికి వాటి వెంట్రుకలు, రక్త నమూనాలను పరీక్షిస్తున్నారు.

News October 30, 2025

తుఫానుతో రూ.5,265 కోట్ల నష్టం: చంద్రబాబు

image

AP: ‘మొంథా’ తుఫాను వల్ల రాష్ట్రానికి రూ.5,265 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేసినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. అత్యధికంగా ఆర్‌అండ్‌బీకి రూ.2,079 కోట్లు, ఆక్వా రంగానికి రూ.1,270 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.829 కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. అయితే ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోలేదని వెల్లడించారు. ముందస్తు చర్యలతో నీటిపారుదల శాఖకు తక్కువ నష్టమే వాటిల్లిందని తెలిపారు.