News June 4, 2024
2019, 2014 ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు?
2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 52 సీట్లకు పరిమితమైంది. 2014లో బీజేపీ 282 స్థానాల్లో గెలిచి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 44 సీట్లు దక్కించుకుంది. ఇక 2024 ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు దక్కుతాయన్నది మరి కొద్దిసేపట్లో తేలనుంది.
Similar News
News October 9, 2024
‘RC16’లో రామ్ చరణ్ లుక్ ఇదేనా?
బుచ్చిబాబు సానా డైరెక్షన్లో ‘RC16’లో రామ్ చరణ్ నటించనున్న సంగతి తెలిసిందే. క్రీడాప్రధానంగా సాగే ఈ కథలో చెర్రీ ఎలా కనిపిస్తారన్న ఆసక్తి ఆయన ఫ్యాన్స్లో ఉంది. ఈరోజు VV వినాయక్ బర్త్ డే సందర్భంగా చరణ్ ఆయన్ను కలిసి విష్ చేశారు. గడ్డంతో పాటు బాడీ కూడా బిల్డ్ చేసిన లుక్లో కనిపిస్తున్నారు. ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ‘రంగస్థలం’ లుక్లో చరణ్ మరో హిట్ కొడతారంటూ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
News October 9, 2024
PAK vs ENG.. ఇలాంటి పిచ్తో టెస్టు క్రికెట్ నాశనం: పీటర్సన్
పాకిస్థాన్, ఇంగ్లండ్ టెస్టు ఆడుతున్న ముల్తాన్లో పిచ్ బౌలర్లకు ఏమాత్రం సహకరించని విధంగా ఉండటంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బౌలర్లకు అది శ్మశానం వంటిదంటూ ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి రెండు రోజుల్లోనైనా ఫలితాన్నివ్వకపోతే ఈ పిచ్ టెస్టు క్రికెట్ని నాశనం చేసినట్లేనని మండిపడ్డారు. ఆ పిచ్పై వికెట్ తీసేందుకు బౌలర్లు చెమటోడుస్తుండటం గమనార్హం.
News October 9, 2024
గత ముఖ్యమంత్రి నిరుద్యోగులను పట్టించుకోలేదు: సీఎం రేవంత్
TG: తమ ప్రభుత్వం 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసి నియామకపత్రాలు అందజేసిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రత్యేక తెలంగాణ కోసం నిరుద్యోగులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని, కానీ గత ముఖ్యమంత్రి వారిని పట్టించుకోలేదని విమర్శించారు. ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు ఉద్యోగాలు ఊడగొట్టాలని ఆనాడే చెప్పానని గుర్తు చేశారు. తాము 65 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలను పూర్తి చేశామన్నారు.