News June 4, 2024
ఈసారి అత్యధిక మెజారిటీ ఎవరికి?
లోక్సభ ఎన్నికల్లో ఈసారి భారీ మెజారిటీ ఎవరికి దక్కుతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. 2019 ఎన్నికల్లో గుజరాత్లోని నవ్సారీ నుంచి బీజేపీ అభ్యర్థి సీఆర్ పాటిల్ 6.89 లక్షల మెజారిటీతో, 2014లో వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ 5.70 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2011 ఉపఎన్నికలో కడప నుంచి వైఎస్ జగన్ 5.45 లక్షల మెజారిటీతో గెలిచారు. మరి ఈ ఎన్నికల్లోభారీ మెజారిటీ ఎవరిదో!
Similar News
News October 8, 2024
రెండు చోట్లా ఆధిక్యంలో ఒమర్ అబ్దుల్లా
జమ్మూకశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా పోటీ చేసిన రెండు చోట్లా ఆధిక్యంలో ఉన్నారు. బుద్గాం, గందర్బల్ రెండు నియోజకవర్గాల్లో ఆయన పోటీ చేశారు. కాగా లీడింగ్పై స్పందించిన ఒమర్ ఫలితాలపై ఇప్పుడే అంచనాకు రాలేమన్నారు. పూర్తి ఫలితాలు వెల్లడయ్యాకే ప్రభుత్వ ఏర్పాటుపై అన్ని పార్టీలతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆయన కాంగ్రెస్ కూటమితో కలిసి ఎన్నికల బరిలో నిలిచారు.
News October 8, 2024
‘పుష్ప-2’ విడుదల తేదీలో మార్పు?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం విడుదల తేదీకంటే ముందే రానున్నట్లు చర్చ జరుగుతోంది. డిసెంబర్ 6న రిలీజ్ అవుతుందని గతంలోనే మేకర్స్ ప్రకటించారు. అయితే, ఒకరోజు ముందుగానే DEC 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. దీనిపై త్వరలోనే మేకర్స్ ప్రకటన చేయనున్నట్లు తెలిపాయి.
News October 8, 2024
SC, ST విద్యార్థులకు ఉచిత DSC శిక్షణ
AP: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచిత డీఎస్సీ శిక్షణ అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 5500 మంది విద్యార్థులకు శిక్షణ అందించే విధంగా స్టడీ సర్కిల్స్ను సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహించనుంది. గతంలో రెండు డీఎస్సీలకు అలాగే కనీసం 100 మందికి శిక్షణ ఇచ్చిన కోచింగ్ సెంటర్లను ఎంపిక చేయనుంది. ఇప్పటికే టెండర్లను ఆహ్వానించింది.