News March 5, 2025
ఐసీసీ ODI టోర్నీల్లో అత్యధిక సెంచరీలు ఎవరివంటే?

ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు ప్రస్తుతం రోహిత్ శర్మ(8) పేరిట ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా గంగూలీ(7), సచిన్(7), ధవన్(6), వార్నర్(6), కోహ్లీ(6), సంగక్కర(6), పాంటింగ్(6), రచిన్ రవీంద్ర(5) , అన్వర్(5), దిల్షాన్(5) , గేల్(5) ఉన్నారు. ఈనెల 9న జరిగే CT ఫైనల్లో రోహిత్ లేదా కోహ్లీ మరో సెంచరీని తమ ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి.
Similar News
News April 4, 2026
గేదెలపై రోజుకు రూ.30 పన్ను.. పాకిస్థాన్లో అంతే!

పాకిస్థాన్లోని పంజాబ్ ప్రభుత్వం వింత పన్ను ప్రవేశపెట్టింది. ఒక్కో గేదె/ఆవుపై రోజుకు 30 PKR ‘గోబర్ ట్యాక్స్’ చెల్లించాలని ఆదేశాలిచ్చింది. అంటే 10 గేదెలు ఉన్న వ్యక్తి నెలకు 9వేల PKR కట్టాలి. ‘స్వచ్ఛ పంజాబ్’ కార్యక్రమం కింద వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కోసం సర్వీస్ ఫీజుగా వసూలు చేయనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. పాక్ ప్రధాని షరీఫ్ అన్న కూతురు మరియం నవాజ్ ఇక్కడ CM కావడం గమనార్హం.
News April 4, 2026
దొంగతనం కేసులో న్యాయమూర్తి.. ముందస్తు బెయిల్ నిరాకరణ

నిందితులకు శిక్షలు విధించే న్యాయమూర్తే దొంగతనం కేసును ఎదుర్కొంటున్న ఘటన పంజాబ్లోని పటియాలాలో జరిగింది. గతేడాది అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి కన్వల్జిత్ సింగ్ చనిపోయారు. అదే రోజు రాత్రి ఆయన ఇంట్లో సివిల్ జడ్జి విక్రమ్దీప్ బంగారు ఆభరణాలను దొంగతనం చేసినట్లు కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన వేసిన పిటిషన్ను పటియాలా కోర్టు తిరస్కరించింది. వీడియో ఆధారాలున్నందున బెయిల్ ఇవ్వలేమంది.
News April 4, 2026
భూమి లాంటి గ్రహాలు 45 ఉన్నాయట!

మన సౌర వ్యవస్థ వెలుపల జీవనానికి అనువైన 45 గ్రహాలు ఉన్నాయని కార్నెల్ వర్సిటీ(US) సైంటిస్టులు గుర్తించారు. నాసా వద్ద ఉన్న 6Kకు పైగా గ్రహాల సమాచారాన్ని బట్టి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతి ప్లానెట్ నక్షత్రం నుంచి ఎనర్జీని ఎలా పొందుతుందో పరిశీలించారు. ఉపరితలంపై ద్రవ రూపంలో నీరుండటానికి ఇదొక కీలక అంశం. వీటిలో TRAPPIST-1 అనే గ్రహం 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.
* light-year=9.46 trillion kilometers


