News April 29, 2024

ఎవరీ ధ్రువ్ రాఠీ? ఎందుకు ట్రెండవుతున్నారు?

image

హరియాణాకు చెందిన ధ్రువ్ రాఠీ ఇండియాలో టాప్ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌గా గుర్తింపు పొందారు. యూట్యూబ్‌లో ఆయనకు 18.7M సబ్‌స్క్రైబర్లున్నారు. సామాజిక, రాజకీయ విశ్లేషణలతో పాపులర్ అయ్యారు. కుండబద్దలుకొట్టే మాటలతో టాప్ పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఎదిగారు. ‘తదుపరి తరం నాయకులు-2023’ జాబితాలో టైమ్ మ్యాగజైన్ చోటు కల్పించింది. ఇటీవల అతడు కేంద్రాన్ని ప్రశ్నిస్తూ వీడియోలు చేయడంతో ట్రెండ్ అవుతున్నారు.

Similar News

News September 16, 2025

కోహ్లీ బయోపిక్ డైరెక్ట్ చేయను: అనురాగ్ కశ్యప్

image

కోహ్లీ అంటే అభిమానం ఉన్నా ఆయన బయోపిక్‌కు తాను దర్శకత్వం వహించనని డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అన్నారు. కోహ్లీ అంటే అందరికీ ఇష్టమని, ఆయనొక అద్భుతమని కొనియాడారు. ఒకవేళ ఎవరిదైనా బయోపిక్ చేయాల్సి వస్తే కష్టమైన సబ్జెక్ట్‌నే ఎంచుకుంటానని తెలిపారు. సాధారణ వ్యక్తి జీవితాన్ని తెరపై చూపిస్తానని పేర్కొన్నారు. కాగా అనురాగ్ తెరకెక్కించిన ‘నిషాంచి’ మూవీ ఈ నెల 19న రిలీజ్ కానుంది.

News September 16, 2025

భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభం

image

భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యాయి. మన దేశంపై ట్రంప్ 50శాతం టారిఫ్‌లు విధించిన తర్వాత తొలిసారి ఈ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఇరుదేశాల మధ్య ఐదు విడతల్లో సమావేశాలు జరిగాయి. ద్వైపాక్షిక వాణిజ్య అంశాలపై చర్చించేందుకు అమెరికా ప్రతినిధి బ్రెండన్ లించ్ ఇప్పటికే భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే.

News September 16, 2025

శ్రీవారి పాదాల చెంత ఘోర అపచారం: భూమన

image

AP: శ్రీవారి పాదాల చెంత ఘోర అపచారం జరిగిందని YCP నేత భూమన కరుణాకర్ రెడ్డి వాపోయారు. ‘అలిపిరిలో మలమూత్రాలు విసర్జించే చోట, మద్యం బాటిల్స్ మధ్య శ్రీ మహావిష్ణువు విగ్రహం పడి ఉంది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా, హైందవ ధర్మానికి తూట్లు పొడిచేలా టీటీడీ తీరు ఉంది. బీఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్ అయిన తర్వాత వరుసగా ఘోర అపచారాలు జరుగుతున్నాయి. హిందూ సంఘాలన్నీ వ్యతిరేకించాల్సిన సమయం వచ్చింది’ అని పేర్కొన్నారు.