News April 29, 2024
ఎవరీ ధ్రువ్ రాఠీ? ఎందుకు ట్రెండవుతున్నారు?

హరియాణాకు చెందిన ధ్రువ్ రాఠీ ఇండియాలో టాప్ సోషల్ మీడియా యాక్టివిస్ట్గా గుర్తింపు పొందారు. యూట్యూబ్లో ఆయనకు 18.7M సబ్స్క్రైబర్లున్నారు. సామాజిక, రాజకీయ విశ్లేషణలతో పాపులర్ అయ్యారు. కుండబద్దలుకొట్టే మాటలతో టాప్ పొలిటికల్ ఇన్ఫ్లూయెన్సర్గా ఎదిగారు. ‘తదుపరి తరం నాయకులు-2023’ జాబితాలో టైమ్ మ్యాగజైన్ చోటు కల్పించింది. ఇటీవల అతడు కేంద్రాన్ని ప్రశ్నిస్తూ వీడియోలు చేయడంతో ట్రెండ్ అవుతున్నారు.
Similar News
News November 22, 2025
ఈ నెల 25 నుంచి 17వ పౌల్ట్రీ ఇండియా ప్రదర్శన

దక్షిణాసియాలోనే అతిపెద్ద 17వ పౌల్ట్రీ ఇండియా-2025 ప్రదర్శన ఈ నెల 25-28 వరకు HYDలోని HICCలో జరగనుంది. దీనికి 1,500 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు, 50 దేశాల నుంచి 500లకు పైగా ఎగ్జిబిటర్లు, 40 వేలకు పైగా సందర్శకులు హాజరుకానున్నారు. పౌల్ట్రీరంగంలో సమస్యలు, AI, ఆటోమేషన్, ఉపాధి వంటి అంశాలపై సెమినార్లు నిర్వహిస్తారు. ఈ సదస్సుకు హాజరుకావాలని CM రేవంత్రెడ్డికి నిర్వాహకులు ఆహ్వానం అందించారు.
News November 22, 2025
‘RRR’పై రీసర్వే చేయండి.. గడ్కరీకి కవిత లేఖ

TG: రీజినల్ రింగ్ రోడ్డు(RRR) అలైన్మెంట్పై రీసర్వే చేయాలని కోరుతూ కేంద్రమంత్రి గడ్కరీకి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత లేఖ రాశారు. ‘రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని గ్రామాల్లో అలైన్మెంట్ను చాలాసార్లు <<18295771>>మార్చారు<<>>. రాజకీయ నేతలు, భూస్వాముల కోసం ఇలా చేశారని స్థానికులు నమ్ముతున్నారు. చిన్న రైతులే నష్టపోతున్నారు’ అని పేర్కొన్నారు. రీసర్వే చేసి, అలైన్మెంట్ ఖరారుకు ముందు స్థానికులతో చర్చించాలని కోరారు.
News November 22, 2025
పైరసీని ఎలా ఆపాలి?.. RGV సలహా ఇదే

భయం మాత్రమే పైరసీని ఆపగలదని డైరెక్టర్ RGV ట్వీట్ చేశారు. పైరసీ ఎప్పటికీ ఆగదని, దానికి కారణం టెక్నాలజీ కాదని పైరసీ చూడడానికి సిద్ధంగా ఉన్న ప్రేక్షకులే అని అభిప్రాయపడ్డారు. “సినిమా టికెట్ ధర ఎక్కువ కాబట్టి పైరసీ సరైంది అంటున్నారు. మరి నగలు ఖరీదుగా ఉంటే దుకాణాన్ని దోచుకుంటామా?” అని ప్రశ్నించారు. పైరసీని ఆపాలంటే అక్రమ లింకులు ఇచ్చేవారితో పాటు వాటిని చూస్తున్నవారిని కూడా శిక్షించాలని సూచించారు.


