News May 20, 2024

ఎవరీ గోపీచంద్?

image

రోదసీ యాత్ర దిగ్విజయంగా పూర్తి <<13278583>>చేసి<<>> చరిత్ర సృష్టించిన గోపీచంద్‌ విజయవాడకు చెందిన వారు. అమెరికాలో స్థిరపడ్డ ఆయన ఎంబ్రీ రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తిచేశారు. ప్రస్తుతం పైలట్‌, ఏవియేటర్‌గా పనిచేస్తున్నారు. విమానాలతో పాటు గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లు, సీప్లేన్‌లను కూడా ఆయన నడిపించగలరు. రాకేశ్ శర్మ తర్వాత రోదసీ యాత్ర చేసిన రెండో భారతీయుడిగా 30 ఏళ్ల గోపీచంద్ గుర్తింపు పొందారు.

Similar News

News October 14, 2025

IRCTCలో 45 పోస్టులు

image

IRCTC 45 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు ఈనెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 15 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది. టెన్త్, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.9,600 స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://irctc.com/

News October 14, 2025

రైడెన్‌తో వచ్చే ఉద్యోగాలెన్నో చెప్పాలి : YCP

image

AP: విశాఖలో గూగుల్ రైడెన్ సంస్థ డేటా సెంటర్ వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ప్రభుత్వం చెప్పాలని YCP డిమాండ్ చేసింది. ‘ఆ సంస్థకు 500 ఎకరాలు, ₹22వేల కోట్ల రాయితీలిస్తున్నారు. రోజుకు 24 మిలియన్ యూనిట్లు విద్యుత్ అవసరం. కనీసం 20వేల ఉద్యోగాలైనా రావాలి. కానీ డేటా సెంటర్‌తో అన్ని జాబ్‌లు రావు. డెవలప్మెంటు సెంటర్‌తో ఐటీ పార్కును అభివృద్ధి చేయాలి’ అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు.

News October 14, 2025

ఇతిహాసాలు క్విజ్ – 35 సమాధానాలు

image

1. రామాయణంలో రాముడు, సుగ్రీవులు కిష్కింధ కాండంలో కలుస్తారు.
2. పాండవులు అరణ్యవాసం 12 సంవత్సరాలు చేశారు.
3. విష్ణువు మూడో అవతారం ‘వరాహ’.
4. కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడు ‘కృత్తికా’ నక్షత్రంతో కలిసి ఉంటాడు.
5. అరటి పండును సంస్కృతంలో కదళీ ఫలమని అంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>>