News April 3, 2024
పెరిగిన ధరలకు ఎవరు బాధ్యులు?: KTR

2014లో ఉన్న చమురు ధరలను ఇప్పటితో పోల్చుతూ ప్రతి భారతీయుడు దీని గురించి ఆలోచించాలని మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘2014 నుంచి ముడి చమురు ధరలు బ్యారెల్కు దాదాపు 20 డాలర్లు తగ్గాయి. కానీ అదే దశాబ్దంలో లీటర్ పెట్రోల్ రూ.35, డీజిల్పై రూ.40 పెరిగాయి. దీనికి ఎవరిని నిందించాలి? నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు ఎవరు బాధ్యత వహించాలి?’ అని ప్రశ్నించారు. 2014 APR 2న లీటర్ పెట్రోల్ రూ.72.26 మాత్రమే.
Similar News
News November 19, 2025
ICC అండర్-19 మెన్స్ WC షెడ్యూల్ విడుదల

ఐసీసీ మెన్స్ అండర్-19 వరల్డ్ కప్ షెడ్యూల్ ఖరారైంది. జింబాబ్వే, నమీబియా సంయుక్త ఆతిథ్యంలో 2026 జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు టోర్నీ జరగనుంది. 16 టీమ్స్ నాలుగు గ్రూపులుగా విడిపోగా గ్రూపుAలో భారత్, USA, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉన్నాయి. ఇక్కడ టాప్ ప్రదర్శన చేసిన జట్లు సూపర్ సిక్స్కు, ఈ ప్రదర్శన ఆధారంగా సెమీస్ అనంతరం ఫైనల్ జట్లు ఖరారు కానున్నాయి. పూర్తి షెడ్యూల్ కోసం పైన స్లైడ్ చేయండి.
News November 19, 2025
నేషనల్-ఇంటర్నేషనల్ న్యూస్ రౌండప్

* గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్ణోయ్కి 11 రోజుల NIA కస్టడీ విధించిన పటియాలా కోర్టు
* భారత్ నుంచి షేక్ హసీనాను రప్పించేందుకు ఇంటర్పోల్ సహాయం తీసుకోవాలని యోచిస్తున్న బంగ్లాదేశ్
* టెర్రర్ మాడ్యూల్ కేసులో అల్ ఫలాహ్ వర్సిటీకి సంబంధించి వెలుగులోకి కీలక విషయాలు.. ఛైర్మన్ జావద్ సిద్దిఖీ కుటుంబీల కంపెనీలకు రూ.415 కోట్లు అక్రమంగా తరలించినట్లు గుర్తించిన ED
News November 19, 2025
30ఏళ్ల పాత కారుకు రూ.10లక్షలు ఆఫర్.. ఎందుకంటే?

కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి తన కెరీర్ తొలినాళ్లలో కొన్న మారుతి 800 కారును తిరిగి పొందేందుకు ఇన్స్టాలో భారీ ఆఫర్ ఇచ్చారు. కారు ఎక్కడుందో కనుక్కొని తెచ్చిస్తే రూ.10లక్షలు ఇస్తానని చెప్పారు. తాజాగా ఈ కారు ఎక్కడుందో గుర్తించిన కొందరు టోయింగ్ వ్యాన్పై తీసుకొచ్చి ఆయనకు అందించారు. కారును చూసి పొంగిపోయిన ఆయన చెప్పినట్లుగానే రూ.10లక్షల చెక్ అందించారు. 1994లో ఈ కారును రూ.1.10లక్షలకు కొన్నట్లు తెలిపారు.


