News April 3, 2024
పెరిగిన ధరలకు ఎవరు బాధ్యులు?: KTR

2014లో ఉన్న చమురు ధరలను ఇప్పటితో పోల్చుతూ ప్రతి భారతీయుడు దీని గురించి ఆలోచించాలని మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘2014 నుంచి ముడి చమురు ధరలు బ్యారెల్కు దాదాపు 20 డాలర్లు తగ్గాయి. కానీ అదే దశాబ్దంలో లీటర్ పెట్రోల్ రూ.35, డీజిల్పై రూ.40 పెరిగాయి. దీనికి ఎవరిని నిందించాలి? నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు ఎవరు బాధ్యత వహించాలి?’ అని ప్రశ్నించారు. 2014 APR 2న లీటర్ పెట్రోల్ రూ.72.26 మాత్రమే.
Similar News
News January 26, 2026
987 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్

కేంద్రీయ విద్యాలయాల్లో 987 స్పెషల్ ఎడ్యుకేటర్ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో TGT 493, PRT 494 పోస్టులున్నాయి. 2026-27 విద్యాసంవత్సరానికి వీటిని భర్తీ చేయనున్నట్లు KVS వెల్లడించింది. జాబును బట్టి డిగ్రీ, డిప్లొమా(స్పెషల్ ఎడ్యుకేషన్), BEd(స్పెషల్ ఎడ్యుకేషన్), CTET ఉత్తీర్ణులు అర్హులు. వయసు 35 ఏళ్లలోపు ఉండాలి.
వెబ్సైట్: https://kvsangathan.nic.in/
News January 26, 2026
కొండెక్కిన వెండి ధర.. ఔన్స్కు $110!

అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ధరలు సరికొత్త రికార్డును సృష్టించాయి. ఇవాళ <<18959429>>ఉదయం<<>> ఔన్స్కు $100 వద్ద ఉన్న ధర ప్రస్తుతం $110కి చేరింది. కేవలం నెల రోజుల్లోనే 54% పెరుగుదల నమోదు కాగా జనవరి 2025తో పోలిస్తే ఏకంగా 280% పెరిగిందని ట్రేడ్ నిపుణులు తెలిపారు. ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో వెండి వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడమే ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణమని అభిప్రాయపడుతున్నారు.
News January 26, 2026
PHOTO GALLERY: అమరావతిలో రిపబ్లిక్ డే

AP: రాజధాని అమరావతిలోని నేలపాడు పరేడ్ గ్రౌండ్లో తొలిసారి నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పోలీసుల కవాతు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రదర్శించిన శకటాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా స్వర్ణ పంచాయతీ- స్వచ్ఛ పంచాయతీ, స్వచ్ఛాంధ్ర, పర్యాటక, ఉద్యానవన శాఖ, అమరావతి, ఐటీ శకటాలు అబ్బురపరిచాయి.


