News June 17, 2024

ఈ ప్రమాదాలకు బాధ్యులెవరు?: తెలంగాణ కాంగ్రెస్

image

మోదీ ప్రభుత్వంలో ఘోర రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. 2014లో గోరఖ్దామ్ ఎక్స్‌ప్రెస్- 25 మంది, 2016లో ఇండోర్-పట్నా ఎక్స్‌ప్రెస్- 150 మంది, 2017లో పురీ-హరిద్వార్ ఎక్స్‌ప్రెస్ 23 మంది, 2022లో బికనీర్-గువాహటి ఎక్స్‌ప్రెస్ 9 మంది, 2023లో బాలాసోర్- 296 మంది, కంచన్‌జంగా రైలు ప్రమాదంలో 15 మంది చనిపోయారని పేర్కొంది. ఈ ప్రమాదాలకు బాధ్యులెవరిని నిలదీసింది.

Similar News

News March 11, 2026

విద్యార్థినులకు ఫ్రీగా స్కూటీలు.. దశల వారీగా అమలు?

image

TG: ప్రభుత్వ డిగ్రీ, బీటెక్ విద్యార్థినులకు ఉచితంగా ఈవీ స్కూటీలు ఇస్తామని CM రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిని దశల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. స్కూటీల ధరలతో పాటు పంపిణీకి ఎంత సమయం పట్టొచ్చనే అంశాలను పరిశీలిస్తోంది. దాదాపు 1.70లక్షల మంది లబ్ధిదారులు ఉంటారని, స్కూటీల కొనుగోలుకు ₹1600Cr ఖర్చవుతుందని అంచనా. రానున్న వార్షిక బడ్జెట్‌లో దీనికి నిధులు కేటాయిస్తారని సమాచారం.

News March 11, 2026

LPG (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) ఎలా తయారు చేస్తారు?

image

LPG ప్రొపేన్, బ్యూటేన్ వాయువుల మిశ్రమం. దీనిని 2 విధాలుగా (నేచురల్ గ్యాస్ ప్రాసెసింగ్, క్రూడ్ ఆయిల్ రిఫైనింగ్) తయారు చేస్తారు. ముందుగా సహజ వాయువు/ముడి చమురు నుంచి ప్రొపేన్, బ్యూటేన్‌ను వేరు చేస్తారు. వీటిలోని నీరు, హైడ్రోజన్ సల్ఫైడ్, CO2 తొలగిస్తారు. తర్వాత ద్రవ రూపంలోకి మార్చి లీకేజీని గుర్తించేలా వాసన గల రసాయనాన్ని(ఈథైల్ మెర్కాప్టన్) కలుపుతారు. తర్వాత బాట్లింగ్ ప్లాంట్లలో సిలిండర్లలో నింపుతారు.

News March 11, 2026

ఐపీఎల్-26కు రూ.18కోట్ల ప్లేయర్ దూరం?

image

IPL మినీ వేలంలో రెండో అత్యధిక ధర(₹18Cr) పలికిన శ్రీలంక పేసర్ పతిరణ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. ఈనెల 28 నుంచి టోర్నీ ప్రారంభం కానుండగా ఆయన ఇంకా KKR జట్టులో చేరలేదని Cricbuzz పేర్కొంది. SL క్రికెట్ బోర్డు సెంటర్‌లో కోలుకుంటున్నట్లు తెలిపింది. పతిరణ ఎడమ కాలు కండరాల నొప్పితో టీ20 WC నుంచి మధ్యలోనే వైదొలిగిన సంగతి తెలిసిందే. IPLలో ఆయన CSK తరఫున 32 మ్యాచుల్లో 47 వికెట్లు తీశారు.