News June 17, 2024
ఈ ప్రమాదాలకు బాధ్యులెవరు?: తెలంగాణ కాంగ్రెస్

మోదీ ప్రభుత్వంలో ఘోర రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. 2014లో గోరఖ్దామ్ ఎక్స్ప్రెస్- 25 మంది, 2016లో ఇండోర్-పట్నా ఎక్స్ప్రెస్- 150 మంది, 2017లో పురీ-హరిద్వార్ ఎక్స్ప్రెస్ 23 మంది, 2022లో బికనీర్-గువాహటి ఎక్స్ప్రెస్ 9 మంది, 2023లో బాలాసోర్- 296 మంది, కంచన్జంగా రైలు ప్రమాదంలో 15 మంది చనిపోయారని పేర్కొంది. ఈ ప్రమాదాలకు బాధ్యులెవరిని నిలదీసింది.
Similar News
News November 20, 2025
ఢిల్లీ బ్లాస్ట్.. నలుగురు కీలక నిందితుల అరెస్ట్

ఢిల్లీ పేలుడు కేసులో మరో నలుగురు కీలక నిందితులను NIA అరెస్ట్ చేసింది. డా.ముజమ్మిల్ షకీల్(పుల్వామా), డా.అదీల్ అహ్మద్(అనంత్నాగ్), డా.షాహీన్ సయిద్(యూపీ), ముఫ్తీ ఇర్ఫాన్(J&K)ను పటియాలా కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకుంది. ఎర్రకోట పేలుడులో వీరు కీలకంగా వ్యవహరించినట్లు NIA గుర్తించింది. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఆరుకు చేరింది.
News November 20, 2025
త్వరలో రెస్టారెంట్లు, సొసైటీల్లో ఎంట్రీకి ఆధార్!

ఆధార్ విషయంలో త్వరలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెస్టారెంట్లలో లైవ్ ఈవెంట్కు వెళ్లాలన్నా, హౌసింగ్ సొసైటీల్లోకి ఎంట్రీ కావాలన్నా, ఏదైనా ఎగ్జామ్ రాయాలన్నా మీ గుర్తింపు కోసం ఆధార్ చూపించాల్సి రావొచ్చు. ఆఫ్లైన్ ఆధార్ వాడకాన్ని పెంచాలనే ఉద్దేశంతో UIDAI ఈ తరహా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వ్యక్తుల ప్రైవసీకి కూడా ఇది ఉపయోగపడుతుందని ఆ సంస్థ చెబుతోంది.
News November 20, 2025
TMC-HBCHలో ఉద్యోగాలు

విశాఖపట్నంలోని <


