News July 1, 2024
రోహిత్ వారసుడెవరో?

టీ20WCలో భారత్ను విశ్వవిజేతగా నిలిపిన రోహిత్ ఆ ఫార్మాట్కు గుడ్ బై చెప్పడంతో సారథిగా ఆయన వారసుడెవరనే చర్చ నెలకొంది. హార్దిక్, సూర్య, బుమ్రా వంటి పేర్లు ప్రస్తావనకు వస్తున్నా జట్టు దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జింబాబ్వే టూర్కు గిల్ను కెప్టెన్గా ఎంపిక చేసినా అది తాత్కాలికమేనని తెలుస్తోంది. దీంతో కొత్త కోచ్ వచ్చాకే సారథిని ఎంపిక చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
Similar News
News November 25, 2025
ఎర్రనల్లితో పంటకు తీవ్ర నష్టం, నివారణ ఎలా?

ఎర్రనల్లి పురుగు వల్ల పంటలకు చాలా నష్టం జరుగుతుంది. ఎరుపు రంగు శరీరంతో ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులుగా పెరుగుతూ ఆకుల నుంచి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల ఆకులోని పత్రహరితం తగ్గిపోయి ఆకులపై తెలుపు, పసుపు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు పాలిపోయి మొక్కలపై బూడిద చల్లినట్లు కళావిహీనంగా కనిపిస్తాయి. ఎర్రనల్లి నివారణకు లీటరు నీటికి డైకోఫాల్ 5ml లేదా అబామెక్టిన్ 0.5ml కలిపి పిచికారీ చేయాలి.
News November 25, 2025
అరుణాచల్ మా భూభాగం: చైనా

షాంఘై ఎయిర్పోర్టులో భారత మహిళను <<18373970>>వేధించారన్న<<>> ఆరోపణలను చైనా ఖండించింది. ‘ఎలాంటి నిర్బంధం, వేధింపులకు ఆమె గురి కాలేదు. చట్టాలు, రూల్స్కు అనుగుణంగానే అధికారులు వ్యవహరించారు. రెస్ట్ తీసుకునేందుకు చోటిచ్చి, ఆహారం, నీళ్లు అందజేశారు. జాంగ్నాన్(అరుణాచల్) చైనా భూభాగం. ఇండియా చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసిన అరుణాచల్ ప్రదేశ్ను మేం ఎప్పుడూ గుర్తించలేదు’ అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ చెప్పారు.
News November 25, 2025
‘నేను మీ పాలకుడిని’ అని చెప్పుకున్న టెర్రరిస్టు ఉమర్ నబీ!

ఢిల్లీ బ్లాస్ట్ సూసైడ్ బాంబర్ ఉమర్ నబీ గురించి కీలక విషయాలు వెల్లడయ్యాయి. టెర్రరిస్టు బుర్హాన్ వాని మృతికి ప్రతీకారం తీర్చుకోవాలని అతడు భావించాడని నిందితులు చెప్పినట్లు సమాచారం. ‘నేను ఎమీర్ను. మీ పాలకుడిని, నాయకుడిని’ అని మిగతా టెర్రరిస్టులకు చెప్పాడని దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. తానో యువరాజు అన్నట్లు చెప్పుకున్నాడని తెలిపాయి. వారి ప్లాన్కు ‘ఆపరేషన్ ఎమిర్’ అని పేరు పెట్టుకున్నట్లు చెప్పాయి.


