News July 1, 2024
రోహిత్ వారసుడెవరో?

టీ20WCలో భారత్ను విశ్వవిజేతగా నిలిపిన రోహిత్ ఆ ఫార్మాట్కు గుడ్ బై చెప్పడంతో సారథిగా ఆయన వారసుడెవరనే చర్చ నెలకొంది. హార్దిక్, సూర్య, బుమ్రా వంటి పేర్లు ప్రస్తావనకు వస్తున్నా జట్టు దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జింబాబ్వే టూర్కు గిల్ను కెప్టెన్గా ఎంపిక చేసినా అది తాత్కాలికమేనని తెలుస్తోంది. దీంతో కొత్త కోచ్ వచ్చాకే సారథిని ఎంపిక చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
Similar News
News November 27, 2025
స్కిల్స్ లేని డిగ్రీలెందుకు: స్టూడెంట్స్

మారుతున్న ఉద్యోగ మార్కెట్కు అనుగుణంగా అకడమిక్ సిలబస్లో మార్పులు తీసుకురావాలని కొందరు విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాలేజీ దశలోనే నైపుణ్య ఆధారిత కోర్సులు, ఉద్యోగ కోచింగ్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. నైపుణ్యం లేని డిగ్రీలతో బయటకు వస్తే ఉద్యోగాలు దొరకడం లేదని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అందుకే ఉద్యోగం ఇప్పిస్తామని <<18402171>>మోసం<<>> చేసేవారు పెరుగుతున్నారన్నారు. మీ కామెంట్?
News November 27, 2025
7,948 MTS, హవల్దార్ పోస్టులు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<
News November 27, 2025
రాజధాని రైతులతో చంద్రబాబు సమావేశం

AP: అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సమావేశం అయ్యారు. ఇందులో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్ అన్సారియా పాల్గొన్నారు. గ్రామ కంఠాలు, జరీబు, అసైన్డ్, లంక భూములు, వీధిపోటు సమస్యలు, రాజధాని గ్రామాల్లో వసతులు, ఉద్యోగాల కల్పనపై చర్చించారు.


