News September 13, 2024
కేంద్రం తర్వాత అతి పెద్ద భూ యజమాని ఎవరంటే..?

దేశంలో అతి పెద్ద భూ యజమాని కేంద్ర ప్రభుత్వమే. ప్రభుత్వం, సాయుధ బలగాలు, రైల్వేలకు కలిపి సర్కారు చేతిలో కోట్ల ఎకరాల భూమి ఉంది. అది అలా ఉంచితే.. కేంద్రం తర్వాతి స్థానం క్యాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియాది! 2021 ఫిబ్రవరి నాటికి చర్చి అధీనంలో భారత్లో 17.29 కోట్ల ఎకరాల భూమి ఉంది. వీటిలో అత్యధిక భూములు బ్రిటిష్ హయాంలో పాలకులు కట్టబెట్టినవే. చర్చి తర్వాతి స్థానంలో వక్ఫ్ బోర్డు ఉంది.
Similar News
News November 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 77

ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా అడగడానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 25, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు

ఇస్రో-<
News November 25, 2025
అధిక సాంద్రత పత్తిసాగు – ఎందుకు ప్రత్యేకం?

ఈ విధానంలో సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య దూరం తగ్గించి ఎకరాకు వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలి. సాధారణ పత్తి సాగులో వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 60 సెంమీ. ఎడం ఉండేలా నాటాలి. అధిక సాంద్రత పద్ధతిలో వరుసల మధ్య 80 సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ (లేదా) వరుసల మధ్య 90 సెం.మీ, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటాలి. దీంతో ఎకరం విస్తీర్ణంలో ఎక్కువ మొక్కల వల్ల దిగుబడి బాగా పెరుగుతుంది.


