News November 11, 2024
రోహిత్ ఆడకపోతే కెప్టెన్ ఎవరంటే?

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఆడటంపై ఇప్పటివరకు క్లారిటీ లేదని కోచ్ గంభీర్ చెప్పారు. అయితే హిట్మ్యాన్ ఆడతారనే ఆశిస్తున్నట్లు మీడియాతో తెలిపారు. సిరీస్ మొదలయ్యే ముందు దీనిపై క్లారిటీ ఇస్తామన్నారు. ఒకవేళ రోహిత్ తొలి టెస్టు ఆడకపోతే బుమ్రా సారథిగా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. అంతేకాకుండా రాహుల్, అభిమన్యు ఈశ్వరన్లలో ఒకరు యశస్వీతో కలిసి ఓపెనింగ్ చేస్తారని తెలిపారు.
Similar News
News December 12, 2025
3.02 కోట్ల IRCTC ఫేక్ అకౌంట్లు బ్లాక్.. కేంద్రం ప్రకటన

2025 JAN నుంచి ఇప్పటివరకు 3.02 కోట్ల IRCTC ఫేక్ అకౌంట్లను డీయాక్టివేట్ చేసినట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. AKAMAI వంటి యాంటీ బాట్ టూల్స్తో నకిలీ అకౌంట్లను బ్లాక్ చేశామన్నారు. జనరల్, తత్కాల్ టికెట్లు సామాన్యులకు అందుబాటులో ఉండేలా రిజర్వేషన్ వ్యవస్థలో మార్పులు చేస్తున్నామని లోక్సభలో తెలిపారు. తత్కాల్ బుకింగ్స్లో ఆధార్ లింక్డ్ ఓటీపీ వ్యవస్థను దశలవారీగా అందుబాటులోకి తెస్తున్నామన్నారు.
News December 12, 2025
తడబడిన భారత్.. SA ఘన విజయం

రెండో టీ20లో 214 రన్స్ బిగ్ ఛేజింగ్ గేమ్లో టీమ్ ఇండియా 162 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 51 రన్స్ తేడాతో SA ఘన విజయం నమోదు చేసింది. తిలక్ వర్మ(62) ఒంటరి పోరాటం వృథా అయ్యింది. జితేశ్(27) ఫర్వాలేదనిపించారు. తొలి ఓవర్ నుంచే బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. SA బౌలింగ్లో బార్ట్మన్ 4, జాన్సెన్, సిపామ్లా, లుంగి ఎంగిడి తలో 2 వికెట్లు తీశారు. 5 మ్యాచుల టీ20 సిరీస్ 1-1తో సమమైంది.
News December 12, 2025
వీళ్లు పొరపాటున కూడా కీరదోస తినొద్దు!

అజీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు కీరదోస తినకూడదని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ఇరిటబుల్ బోవల్ సిండ్రోమ్ ఉన్న వాళ్లు తింటే గ్యాస్, ఉబ్బరం సమస్య వచ్చే ప్రమాదం ఉంది. శరీరాన్ని చల్లబరిచే స్వభావం ఉన్నందున జలుబు, సైనస్ సమస్యలు, బ్రాంకైటిస్, ఉబ్బసం, కఫంతో బాధపడేవాళ్లు, ఎక్కువరోజులు జలుబుతో ఇబ్బందిపడేవాళ్లు తినకూడదు. ముక్కు దిబ్బడ, దగ్గు ఉన్నవాళ్లు తింటే సమస్య ఎక్కువవుతుంది.


