News October 11, 2024

ఆ మ్యాచ్‌కి భారత జట్టు కెప్టెన్ ఎవరు?

image

ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్‌లో మొద‌టి రెండు మ్యాచ్‌ల‌లో ఒక‌దానికి కెప్టెన్ <<14326057>>రోహిత్ శ‌ర్మ గైర్హాజ‌ర‌య్యే<<>> అవ‌కాశం ఉండ‌డంతో ఆ మ్యాచ్‌కి సారథ్యం వ‌హించేది ఎవ‌ర‌న్న దానిపై ఆస‌క్తి నెల‌కొంది. బుమ్రా, కేఎల్ రాహుల్, శుభ్‌మ‌న్ గిల్‌, రిష‌భ్ పంత్‌ల‌లో ఒకరికి కెప్టెన్‌గా ఛాన్స్ ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. AUS లాంటి బలమైన జట్టుతో మ్యాచ్ కాబట్టి మళ్లీ కోహ్లీకి పగ్గాలు ఇచ్చే అవకాశం లేకపోలేదు.

Similar News

News November 28, 2025

ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు

image

*నూర్‌బాషా, దూదేకుల సహకార ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ఆమోదం
*తిరుపతి ఎస్వీ వర్సిటీలో లైవ్‌స్టాక్ రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు
*ఖరీఫ్ అవసరాలకు మార్క్‌ఫెడ్ ద్వారా రూ.5వేల కోట్ల రుణ ప్రతిపాదనకు ఆమోదం
*పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు, పట్టణాభివృద్ధి శాఖలో చట్టసవరణలకు ఆమోదం

News November 28, 2025

వరి మాగాణుల్లో మినుము, పెసర ఎప్పుడు వెదజల్లాలి?

image

ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతాల్లో వరి కోయడానికి వారం, 10 రోజుల ముందు నుంచి బురద పదునులో మినుము మరియు పెసర లాంటి పప్పుజాతి పైర్ల విత్తనాలను శుద్ధి చేసి సమానంగా వెదజల్లుకోవాలి. పెసర అయితే ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాలు, మినుములు ఎకరానికి 16 నుంచి 18 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. తెగుళ్ల నుంచి రక్షణకు కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ పొడిమందును పట్టించి విత్తనశుద్ధి చేసుకోవాలి.

News November 28, 2025

ఇతిహాసాలు క్విజ్ – 80 సమాధానాలు

image

ప్రశ్న: ఉప పాండవులను ఎవరు, ఎందుకు చంపారు?
సమాధానం: ఉప పాండవులను చంపింది అశ్వత్థామ. కురుక్షేత్రంలో తన తండ్రి ద్రోణాచార్యుడి మరణానికి ప్రతీకారంగా, ఆయనను అన్యాయంగా చంపారని భావించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. యుద్ధ రీతిని వీడి, నైతికతను మరచి నిద్రిస్తున్న పాండవుల కుమారులను పాండవులుగా భ్రమించి దారుణంగా చంపాడు. కౌరవ సేనాపతిగా చనిపోతున్న దుర్యోధనుడికిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>