News October 11, 2024
ఆ మ్యాచ్కి భారత జట్టు కెప్టెన్ ఎవరు?
ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్లో మొదటి రెండు మ్యాచ్లలో ఒకదానికి కెప్టెన్ <<14326057>>రోహిత్ శర్మ గైర్హాజరయ్యే<<>> అవకాశం ఉండడంతో ఆ మ్యాచ్కి సారథ్యం వహించేది ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. బుమ్రా, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, రిషభ్ పంత్లలో ఒకరికి కెప్టెన్గా ఛాన్స్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. AUS లాంటి బలమైన జట్టుతో మ్యాచ్ కాబట్టి మళ్లీ కోహ్లీకి పగ్గాలు ఇచ్చే అవకాశం లేకపోలేదు.
Similar News
News October 11, 2024
మెగాస్టార్తో విక్టరీ వెంకటేశ్: పిక్స్ వైరల్
‘విశ్వంభర’ సెట్స్లో మెగాస్టార్ చిరంజీవిని హీరో దగ్గుబాటి వెంకటేశ్ కలిశారు. ఆయనతోపాటు హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ కూడా చిరును కలిసి సందడి చేశారు. కాగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకీ ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి, ఐశ్వర్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరోవైపు చిరు నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీ టీజర్ రేపు ఉదయం హైదరాబాద్లోని మైత్రీ విమల్ థియేటర్లో విడుదల కానుంది.
News October 11, 2024
జగన్పై కోపం లడ్డూపై చూపించారు: నారాయణ
AP: జగన్పై ఉన్న కోపాన్ని కూటమి సర్కార్ తిరుమల లడ్డూపై చూపించిందని సీపీఐ నారాయణ ఆరోపించారు. ఈ అంశం RSSకు రాజకీయంగా ఉపయోగపడిందన్నారు. గత ప్రభుత్వం మద్యంలో హోల్సేల్గా దోచుకుందని మండిపడ్డారు. ఇప్పుడు TDP, YCP సిండికేట్గా మారి అరాచకం చేయబోతున్నాయని విమర్శించారు. ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు మాట్లాడకుండా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక ఎక్కడా దొరకడం లేదన్నారు.
News October 11, 2024
మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
TG: మంత్రి కొండా సురేఖ ప్రభుత్వ విద్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గవర్నమెంట్ టీచర్ల పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్నారు. మీరు చెప్పే విద్యపై మీకే నమ్మకం లేదా? ప్రభుత్వ టీచర్లు తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్లలోనే చేర్పించాలి’ అని వ్యాఖ్యానించారు. అన్ని కులాలు, మతాల విద్యార్థులను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ప్రారంభిస్తున్నామన్నారు. మంత్రి సురేఖ వ్యాఖ్యలపై మీ కామెంట్?