News October 24, 2024
బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఎవరికి?
BJP జాతీయ అధ్యక్ష ఎన్నికపై ఆసక్తి నెలకొంది. ఈ సారి దక్షిణాది నేతకు ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది. అదే గనక జరిగితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రేసులో ముందున్నట్టు తెలుస్తోంది. కర్ణాటక, తెలంగాణ, AP, కేరళలో పార్టీ బలోపేతానికి ఇది దోహదపడుతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు! ఉత్తరాది విషయానికొస్తే రాజ్నాథ్ సింగ్, శివరాజ్సింగ్ చౌహాన్, వినోద్ తావ్డే, సునీల్ బన్సల్ రేసులో ఉన్నారు.
Similar News
News October 24, 2024
ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి.. ఐదుగురు సైనికులకు గాయాలు
కశ్మీర్లో ఉగ్రమూకలు మరో దాడికి తెగబడ్డాయి. ఉత్తర కశ్మీర్లోని గుల్మార్గ్ బోటాపతేర్ ప్రాంతంలో సైనికుల వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు సైనికులు గాయపడినట్టు తెలుస్తోంది. గందర్బాల్లో ఓ కార్మికుడిపై కాల్పులు జరిగిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 24, 2024
అశ్విన్ సూచనలతోనే 7 వికెట్లు తీయగలిగా: వాషింగ్టన్
న్యూజిలాండ్పై తాను 7 వికెట్లు తీయడం వెనుక తన తోటి స్పిన్నర్ అశ్విన్ ఇచ్చిన సూచనలు కీలకమయ్యాయని వాషింగ్టన్ సుందర్ తెలిపారు. ‘బాల్ బాగా సాఫ్ట్గా మారడంతో వికెట్ల కోసం బంతిని వేగంగా విసరాలని అశ్విన్ సూచించారు. ఆ టెక్నిక్తోనే కాన్వేను ఆయన ఔట్ చేశారు. ఆ సూచన పాటించడంతో పాటు సరైన ప్రాంతాల్లో బంతిని వేయడం ద్వారా వికెట్లు తీయగలిగాను. అశ్విన్తో కలిసి మరిన్ని మ్యాచులు ఆడాలనుకుంటున్నాను’ అని వివరించారు.
News October 24, 2024
ఎన్విడియా ఫౌండర్ జెన్సన్తో లోకేశ్ భేటీ
AP: ఎన్విడియా వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్తో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. ముంబైలో జరిగిన ఎన్విడియా ఏఐ సమ్మిట్లో వీరిద్దరూ కలుసుకున్నారు. అమరావతిలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటులో సూచనలు, మద్దతు ఇవ్వాల్సిందిగా జెన్సన్ను కోరినట్లు లోకేశ్ ఎక్స్లో ట్వీట్ చేశారు. అలాగే భవిష్యత్లో ఏఐ విస్తరణపై కూడా చర్చించినట్లు తెలిపారు. మళ్లీ ఆయనను కలుసుకునేందుకు తహతహలాడుతున్నానంటూ పేర్కొన్నారు.