News March 18, 2024
మల్కాజిగిరిలో పాగా వేసేదెవరో?

గత MP ఎన్నికల్లో మల్కాజిగిరిలో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన రేవంత్ రెడ్డి గెలుపొందారు. ఆయనకు 6,03,748 ఓట్లు రాగా BRS అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డికి 5,92,829 ఓట్లు, BJP అభ్యర్థి రాంచందర్రావుకు 3,04,282 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బలమైన అభ్యర్థి కోసం కసరత్తు చేస్తోంది. BRS తరఫున రాగిడి లక్ష్మారెడ్డి పేరును ప్రకటించగా BJP నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు.
Similar News
News October 21, 2025
జూబ్లీహిల్స్లో పోటెత్తిన నామినేషన్లు..!

HYDజూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా క్యూలో 100కు పైగా నామినేషన్ల సెట్లు ఉన్నాయి. ఈరోజు సా.6.30 వరకు మొత్తం 80 దాఖలయ్యాయి. సా.3లోపు ఆర్వో ఆఫీస్ లోపలికి వెళ్లిన అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఒక్కో నామినేషన్ను క్షుణ్ణంగా పరిశీలించి అనంతరం రిటర్నింగ్ అధికారి స్వీకరిస్తుండడంతో మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.ఈరోజు చివరి తేదీ కావడంతో అభ్యర్థులు పోటెత్తారు.
News October 21, 2025
HYD: బీసీ నేతలపై కేసులను ఉపసంహరించుకోవాలి: ఆర్.కృష్ణయ్య

శాంతియుతంగా నిరసన తెలిపితే కేసులు పెడతారా అని BJP ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా బీసీ బంద్ విజయవంతమైందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారని చెప్పారు. అయితే బీసీ బంద్లో చిన్నాచితక గొడవలు జరిగాయని, వాటిని పోలీసులు కోరంతను కొండంత చేసి అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. తమపై బనాయించిన 30 కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు.
News October 21, 2025
HYD: సీఎం ప్రజావాణికి 62 దరఖాస్తులు

బేగంపేట్లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 62 దరఖాస్తులు అందాయి. దీపావళి వేడుకలు ఉన్నా ప్రజలు సీఎం ప్రజావాణికి వచ్చారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 18, రెవెన్యూ శాఖకు సంబంధించి 10, ఇందిరమ్మ ఇళ్ల కోసం 14, ప్రవాసి ప్రజావాణికి 2 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 18 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.