News April 12, 2025
ఈ నెలలో భారత్కు అమెరికా ఉపాధ్యక్షుడు?

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ నెల 21 నుంచి 24 మధ్య భారత్కు సతీసమేతంగా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమయానికి అమెరికా జాతీయ భద్రతా సలహాదారు వాల్జ్ కూడా భారత్లోనే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానితో భేటీ అనంతరం వాన్స్ తన భార్యతో కలిసి జైపూర్, ఆగ్రా పర్యటిస్తారని సమాచారం. ఆయన భార్య ఉష భారత సంతతి మహిళ కావడం విశేషం.
Similar News
News December 4, 2025
ఫిబ్రవరిలో పెళ్లి అని ప్రచారం.. స్పందించిన రష్మిక

నటి రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలు కొంతకాలంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. 2026 ఫిబ్రవరిలో రాజస్థాన్లో పెళ్లి జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘వివాహాన్ని నేను ధ్రువీకరించను. అలాగని ఖండించను. సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. అంతకుమించి ఏమీ చెప్పను’ అని ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు.
News December 4, 2025
APPLY NOW: BEMLలో ఉద్యోగాలు

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(<
News December 4, 2025
‘హిల్ట్’ లీకేజ్.. ఇద్దరు ఉన్నతాధికారులపై అనుమానం!

TG: <<18457165>>హిల్ట్<<>> పాలసీ లీకేజీపై విజిలెన్స్ టీమ్ విచారణ వేగవంతం చేసింది. ఈ లీక్ వెనుక ఇద్దరు ఉన్నతాధికారులు ఉన్నారని అనుమానిస్తోంది. సీఎంఓలోని ఓ అధికారిని నిన్న రాత్రి టీమ్ విచారించినట్లు తెలుస్తోంది. అటు BRSతో పాటు ఓ కీలక బీజేపీ నేతకు కూడా సమాచారం లీక్ అయినట్లు టాక్. ఉన్నతాధికారుల ప్రమేయంపై క్లారిటీ రావాల్సి ఉంది. CM ఈ విషయమై సీరియస్గా ఉండటంతో క్లారిటీ వస్తే కారకులకు షోకాజ్ నోటీస్ ఇచ్చే అవకాశముంది.


