News March 16, 2024

అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎవరు?

image

AP: 25 MP స్థానాల్లో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన YCP.. అనకాపల్లి స్థానాన్ని పెండింగ్‌లో ఉంచింది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ సత్యవతికి మరోసారి టికెట్ ఇచ్చేందుకు హైకమాండ్ ఆసక్తిగా లేదు. దీంతో ఇక్కడ ఎవర్ని బరిలోకి దించుతారనే దానిపై ఆసక్తి నెలకొంది. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా కమలం పార్టీ తరఫున సీఎం రమేశ్ బరిలో నిలుస్తారనే ప్రచారం జరుగుతుండగా.. BCల్లో బలమైన అభ్యర్థికై YCP అన్వేషిస్తోంది.

Similar News

News August 17, 2025

రవితేజ ‘మాస్ జాతర’ విడుదల వాయిదా?

image

మాస్ మహారాజా రవితేజ ‘మాస్ జాతర’ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 27న రిలీజ్ కావాల్సిన ఈ మూవీని అక్టోబర్ 20కి పోస్ట్‌పోన్ చేస్తారని సమాచారం. సినీ కార్మికుల సమ్మె వల్ల పెండింగ్ వర్క్ పూర్తి కాలేదని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్. భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News August 17, 2025

సీఎంతో పీసీసీ చీఫ్ భేటీ

image

TG: సీఎం రేవంత్ రెడ్డితో ఈ ఉదయం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సందిగ్ధత, ఎన్నికల నిర్వహణకు కోర్టు విధించిన గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల నిర్వహణపై ఓ క్లారిటీ వచ్చేందుకు కీలకంగా భావిస్తున్న PAC సమావేశం తేదీ ఖరారుపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం.

News August 17, 2025

చికెన్ బోన్స్ తింటున్నారా?

image

చాలామంది చికెన్‌తో పాటు ఎముకలను నమిలేస్తుంటారు. బోన్స్ తింటే జీర్ణ సమస్యలు రావొచ్చని, కృత్రిమంగా పెరిగిన కోళ్ల ఎముకలతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవి జీర్ణమయ్యేందుకు టైమ్ పడుతుందని, పేగులలో అడ్డంకులు ఏర్పడొచ్చని అంటున్నారు. ఎముకలు అన్నవాహిక, శ్వాసనాళంలో చిక్కుకునే అవకాశముంటుందని, శ్వాసనాళంలో ఇరుక్కుపోతే ఊపిరాడక ఇబ్బంది ఎదురవ్వొచ్చని పేర్కొంటున్నారు. SHARE IT.