News March 16, 2024

అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎవరు?

image

AP: 25 MP స్థానాల్లో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన YCP.. అనకాపల్లి స్థానాన్ని పెండింగ్‌లో ఉంచింది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ సత్యవతికి మరోసారి టికెట్ ఇచ్చేందుకు హైకమాండ్ ఆసక్తిగా లేదు. దీంతో ఇక్కడ ఎవర్ని బరిలోకి దించుతారనే దానిపై ఆసక్తి నెలకొంది. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా కమలం పార్టీ తరఫున సీఎం రమేశ్ బరిలో నిలుస్తారనే ప్రచారం జరుగుతుండగా.. BCల్లో బలమైన అభ్యర్థికై YCP అన్వేషిస్తోంది.

Similar News

News November 14, 2025

కాంగ్రెస్‌కు కొత్త నిర్వచనం చెప్పిన PM మోదీ

image

ఇప్పుడున్న కాంగ్రెస్ MMCగా మారిందని బిహార్ విక్టరీ సెలబ్రేషన్స్‌లో ప్రధాని మోదీ విమర్శించారు. ‘MMC అంటే ముస్లింలీగ్ మావోవాది కాంగ్రెస్. ఇతర పార్టీల ఓట్లతో బతకాలని కాంగ్రెస్ చూస్తోంది. ఎన్నికలు వస్తే వేరే పార్టీలనూ ముంచేస్తోంది. ప్రజలకు ఆ పార్టీపై క్రమంగా విశ్వాసం పోతోంది’ అని వ్యాఖ్యానించారు. ఇక బిహార్‌లో ఆర్జేడీ MY(ముస్లిం, యాదవ్) ఫార్ములాను నమ్మితే తాము MY(మహిళా, యూత్)ను నమ్మినట్లు చెప్పారు.

News November 14, 2025

మళ్లీ తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర ఇవాళ ఒకేరోజు రెండు సార్లు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రేట్ ఉదయం రూ.770 తగ్గగా తాజాగా రూ.810 దిగివచ్చింది. దీంతో రూ.1,27,040కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర ఉదయం రూ.700 తగ్గగా ఇప్పుడు రూ.750 తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.1,16,450గా నమోదైంది. అటు వెండి ధర కేజీపై 100 తగ్గి రూ.1,83,100కు చేరింది.

News November 14, 2025

తేజస్వీ విజయం.. తేజ్ ప్రతాప్ పరాజయం

image

బిహార్ ఎన్నికల్లో మహా కూటమి CM అభ్యర్థి, RJD నేత తేజస్వీ యాదవ్ గెలిచారు. రాఘోపూర్ నియోజకవర్గంలో BJP నేత సతీశ్ కుమార్‌పై 14,532 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మరోవైపు మహువా నియోజకవర్గంలో తేజస్వీ సోదరుడు, JJD చీఫ్ తేజ్ ప్రతాప్(-51,938 ఓట్లు) మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. రామ్‌విలాస్ అభ్యర్థి సంజయ్ కుమార్ సింఘ్ 44 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. రెండో స్థానంలో RJD అభ్యర్థి ముకేశ్ కుమార్ నిలిచారు.