News March 24, 2024

రాహుల్‌పై పోటీ చేసేది ఎవరంటే?

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నుంచి బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే. ఆయనపై కేరళ బీజేపీ చీఫ్ సురేంద్రన్ పోటీ చేయనున్నారు. తాజాగా ప్రకటించిన జాబితాలో బీజేపీ ఆయన పేరును చేర్చింది. 2019లో సురేంద్రన్ పతనంతిట్ట లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2021లో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెండు స్థానాల్లో బరిలోకి దిగి పరాజయం పాలయ్యారు.

Similar News

News October 28, 2025

మార్చి మూడో వారం నుంచి టెన్త్ ఎగ్జామ్స్?

image

TG: పదో తరగతి పరీక్షలను మార్చి మూడో వారం నుంచి నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం. 16 లేదా 18వ తేదీ నుంచి ఎగ్జామ్స్ ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహిస్తామని ఇటీవల అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏటా ఇంటర్ పరీక్షలు ముగిసే రెండు రోజుల ముందు టెన్త్ ఎగ్జామ్స్ మొదలవడం ఆనవాయితీగా వస్తోంది.

News October 28, 2025

ఉదయాన్నే టీ, కాఫీ తాగుతున్నారా?

image

ఉదయం లేవగానే కాఫీ, టీ తాగితేనే కానీ చాలామంది కాలకృత్యాలు పూర్తి చేయలేరు. అయితే ఇదెంతమాత్రం మంచిది కాదంటున్నారు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా.సుశీల్ శర్మ. ‘టీ, కాఫీలు ముందు పెద్దపేగును కదిలిస్తాయి. తరువాత అదే అలవాటుగా మారి చివరకు పేగుల సహజ రిథమ్‌ను దెబ్బతీస్తాయి. ఆపై పొట్టలో ఇరిటేట్ చేస్తాయి. ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి’ అని పేర్కొన్నారు. వాటి బదులు గోరువెచ్చని నీటిని సేవించాలని సూచించారు.

News October 28, 2025

అడుగున ఎరువుకొద్దీ పైన బంగారం

image

ఏ పొలానికైనా ఎరువులే బలం అని చెప్పేందుకు ఈ సామెతను ఉపయోగిస్తారు. పొలం పనులలో భూమికి ఎరువు వేయడం కష్టమైనా, సరైన ఎరువు ఫలితంగా బంగారంలాంటి పంట పండి మనకు సంతోషం కలుగుతుంది. అలాగే, కష్టపడి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని ఈ సామెత చెబుతుంది.