News March 17, 2024

ఖమ్మంలో పాగా వేసేదెవరు..?

image

KMM, MHBDలో పాగా వేయాలని కాంగ్రెస్‌ వ్యూహాలు రచిస్తోంది. MHBD స్థానం నుంచి బలరాంనాయక్‌ బరిలో ఉండగా.. ఖమ్మం అభ్యర్థిని ప్రకటించలేదు. అటూ BRS ఈ రెండు స్థానాలను నిలబెట్టుకోవాలని అడుగులు వేస్తోంది. సిట్టింగ్‌ ఎంపీలు నామా నాగేశ్వరరావు, కవితకు మళ్లీ టికెట్లు ప్రకటించింది. మరో పక్క BJP సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతోంది. MHBD నుంచి అజ్మీరా సీతారాంనాయక్‌ను బరిలో నిలిపింది. ఖమ్మం అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.

Similar News

News April 1, 2026

సత్తుపల్లి మున్సిపాలిటీలో ఏసీబీ సోదాలు

image

సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తెల్లవారుజాము వరకు మెరుపు దాడులు నిర్వహించారు. ఇంటి పన్నులు, భవన క్రమబద్ధీకరణలో భారీగా లంచాలు వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదులపై ఆరా తీశారు. ఉద్యోగుల ఫోన్ పే లావాదేవీలను పరిశీలించి, ఫోన్లను సీజ్ చేశారు. రూ.12 కోట్ల నిధులు రూ.12 లక్షలకు తగ్గడంపై కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు, పలువురు సిబ్బందికి విచారణ నోటీసులు జారీ చేశారు.

News April 1, 2026

ఖమ్మం: రేపు గ్రామ, వార్డు సభలు.. ప్రభుత్వ సూచనలు

image

1) ఉ.10గంటలకు రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ ఆలపించి, సభను ప్రారంభించాలి.
2) గ్రామసభలో సర్పంచ్‌తోపాటు పాలకవర్గం, వార్డు సభలో మున్సిపల్ ఛైర్మన్‌తోపాటు పాలకవర్గం, అధికారులు, ప్రజలు హాజరుకావాలి.
3) CMసందేశాన్ని చదివి వినిపించాలి.
4) ప్రభుత్వ విజయాలు, 6గ్యారంటీలపై అవగాహన కల్పించి, పథకాలకు అర్హులను గుర్తించాలి.
5) ప్రజాసమస్యల కోసం ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేయాలి.. పరిష్కారాలపై కార్యాచరణ రూపొందించాలి.

News April 1, 2026

KMM: నేటి నుంచి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ

image

రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 1 నుంచి జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల్లో ఈ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో 748 దుకాణాల పరిధిలో 4,69,865 కార్డుదారులు ఉండగా, 13,28,400 మంది లబ్ధి పొందుతున్నారు. లబ్ధిదారులకు ఒక్కొక్కరికి నెలకు ఆరు కేజీల చొప్పున, మూడు నెలలకు గాను 2,54,71,860 కేజీల బియ్యం అవసరమని అధికారులు తెలిపారు.