News August 23, 2024

ఐసీసీకి వెళ్తే జైషా స్థానంలో వచ్చేదెవరు?

image

ఒకవేళ ICC ఛైర్మన్‌గా జైషా ఎన్నికైతే BCCI కార్యదర్శిగా ఎవరుంటారన్నది ఆసక్తికరంగా మారింది. వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, ట్రెజరర్ ఆశీశ్ షెలార్, IPL ఛైర్మన్ అరుణ్ ధుమాల్, జాయింట్ సెక్రటరీ దేవజిత్ పేర్లు వినిపిస్తున్నాయి. యువకులైన రోహన్ S/O అరుణ్ జైట్లీ, అవిషేక్ S/O జగ్మోహన్ దాల్మియా పేర్లూ చర్చకు రావొచ్చు. కార్యదర్శిగా మరో ఏడాది పదవీకాలం ఉన్న జైషా కూలింగ్ ఆఫ్ నేపథ్యంలో ICCకి వెళ్తారా అన్నదే డౌట్.

Similar News

News December 11, 2025

చనిపోయిన సర్పంచి అభ్యర్థి.. ఎన్ని ఓట్లు వచ్చాయంటే?

image

TG: మరణించిన సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేసి పలువురు అభిమానాన్ని చాటుకున్నారు. మహబూబాబాద్ మండలం నడివాడ సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి నామినేషన్ వేసిన బుచ్చిరెడ్డి ఈ నెల 9న గుండెపోటుతో మరణించారు. ఎన్నికల్లో అధికారులు ఆయనకు బ్యాట్ గుర్తు కేటాయించారు. ఇవాళ జరిగిన పోలింగ్‌లో బుచ్చిరెడ్డికి 165 ఓట్లు వచ్చాయి. అభ్యర్థి మరణించినా ఓటు వేయడం గమనార్హం.

News December 11, 2025

ఇంటికి ఒకే ద్వారం ఉండవచ్చా?

image

పెద్ద ఇంటికి ఒకే ద్వారం నియమం వర్తించదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘గుడికి ఒకే ద్వారం ఉంటుంది. కిటికీలు ఉండవు. ఇల్లు కూడా అలాగే ఉండవచ్చు కదా? అని చాలామంది అనుకుంటారు. కానీ ఇళ్లు, ఆలయాలు ఒకటి కాదు. వాస్తు నియమాలు వేర్వేరుగా ఉంటాయి. ఇంట్లో మనుషులు నివసిస్తారు కాబట్టి రాకపోకలకు, గాలి, వెలుతురుకు ద్వారాలు, కిటికీలు తప్పనిసరి, చిన్న ఇంటికి ఓ ద్వారం ఉన్నా పర్లేదు’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News December 11, 2025

విత్తన బిల్లును వెనక్కు తీసుకోవాలి: KTR

image

TG: కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలకు పెద్దపీట వేసే విధంగా ఉన్న విత్తన బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలని BRS నేత KTR డిమాండ్ చేశారు. ‘ఎలాంటి ట్రయల్స్ లేకుండా విదేశీ విత్తనాలు దేశంలోకి వచ్చే ప్రమాదం ఉంది. రైతులకు పరిహారం గ్యారంటీ లేదు. నకిలీ విత్తనాలకు కంపెనీలను కాకుండా అమ్మకందారులను బాధ్యుల్ని చేసేలా బిల్లు ఉంది. రాష్ట్ర అగ్రి శాఖల్లోని కీలక విత్తనాలు కేంద్ర ఆధిపత్యంలోకి వెళ్తాయి’ అని పేర్కొన్నారు.