News July 27, 2024
నన్ను సినిమాలు తీయకుండా ఎవరాపుతారో చూస్తా: విశాల్

నిర్మాతల మండలి తనపై బ్యాన్ విధించడం పట్ల హీరో విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలు తీయకుండా ఎవరు ఆపుతారో చూస్తానంటూ సవాల్ విసిరారు. నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన రూ.12 కోట్ల నిధుల్ని దుర్వినియోగం చేశారంటూ ప్రస్తుత మండలి ఆరోపిస్తోంది. ‘మండలి సభ్యుల సంక్షేమానికే ఆ నిధుల్ని వినియోగించాం. ఆ విషయం మీకు తెలీదా? పరిశ్రమలో చాలా సమస్యలున్నాయి. వాటిపై దృష్టి పెట్టండి’ అని సూచించారు.
Similar News
News November 17, 2025
పెరిగిన బంగారం ధరలు

ఇవాళ ఉదయం స్వల్పంగా <<18308959>>తగ్గిన<<>> బంగారం ధరలు సాయంత్రం పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా. గోల్డ్ రూ.320 పెరిగి రూ.1,25,400కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి ధర రూ.300 ఎగిసి రూ.1,14,950గా నమోదైంది. వెండి ధరలో సాయంత్రం ఎలాంటి మార్పు జరగలేదు. కేజీ రూ.1,73,000గా ఉంది.
News November 17, 2025
పెరిగిన బంగారం ధరలు

ఇవాళ ఉదయం స్వల్పంగా <<18308959>>తగ్గిన<<>> బంగారం ధరలు సాయంత్రం పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా. గోల్డ్ రూ.320 పెరిగి రూ.1,25,400కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి ధర రూ.300 ఎగిసి రూ.1,14,950గా నమోదైంది. వెండి ధరలో సాయంత్రం ఎలాంటి మార్పు జరగలేదు. కేజీ రూ.1,73,000గా ఉంది.
News November 17, 2025
భక్తులకు గుడ్న్యూస్.. శబరిమలకు ప్రత్యేక రైళ్లు

AP: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ నుంచి కొల్లంకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వేస్ ప్రకటించింది. రేపట్నుంచి జనవరి 21 వరకు ఈ రైళ్లను నడపనుంది. ఈ ట్రైన్స్ ప్రతి మంగళవారం విశాఖ-కొల్లం(08539), ప్రతి బుధవారం కొల్లం-విశాఖ(08540) మధ్య స్లీపర్, 2AC, 3AC బోగీలతో నడవనున్నాయి. ఇవి రాజమండ్రి, VJA, నెల్లూరు, రేణిగుంట మీదుగా వెళ్తాయి. ఈ రైళ్లకు ముందస్తు రిజర్వేషన్ కూడా అందుబాటులో ఉంది.


