News September 26, 2024
ఆ ముగ్గురిలో యువీ ఎవర్ని ఎంచుకుంటారంటే..?

ధోనీ, కోహ్లీ, రోహిత్ ముగ్గురూ భారత క్రికెట్లో దిగ్గజాలే. వీరిలో ఒకరినే ఎంచుకోవాలంటే కష్టం. ఇదే ప్రశ్న ఓ ఇంటర్వ్యూలో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్కు ఎదురైంది. ఆయన రోహిత్ వైపు మొగ్గు చూపారు. ‘టీ20 ఫార్మాటైతే కచ్చితంగా రోహిత్నే ఎంచుకుంటా. అత్యద్భుతమైన కెప్టెన్సీ, బ్యాటింగ్తో విజయాన్ని అందించగలరు. కచ్చితంగా శర్మే ఫస్ట్ ఛాయిస్’ అని స్పష్టం చేశారు. మీరైతే ఆ ముగ్గురిలో ఎవర్ని సెలక్ట్ చేస్తారు?
Similar News
News January 16, 2026
ఇంటి సింహద్వారం ఎలా ఉండాలంటే?

ఇంటికి సింహద్వారం ఎంతో ప్రధానమైనదని, ఇది ఇంటి యజమాని అభిరుచికి, ఉన్నతికి నిదర్శనమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు పేర్కొంటున్నారు. ‘సింహద్వారం ఏ దిశలో ఉన్నా దానికి రెండు వైపులా కిటికీలు ఉండటం శాస్త్రరీత్యా తప్పనిసరి. మిగిలిన ద్వారాల కంటే ఇది ఎత్తులోనూ, వెడల్పులోనూ పెద్దదిగా ఉండాలి. ప్రత్యేకమైన ఆకర్షణతో ఉట్టిపడాలి. అప్పుడే ఆ ఇంటికి నిండుదనం, వాస్తు బలం చేకూరుతాయి’ అని సూచిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 16, 2026
YTలో పిల్లల స్క్రీన్ టైమ్ను నియంత్రించవచ్చు!

పిల్లల స్క్రీన్ టైమ్ను నియంత్రించేందుకు యూట్యూబ్ ‘పేరెంటల్ కంట్రోల్స్’ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా పిల్లలు యూట్యూబ్ వీడియోలు చూడకుండా పూర్తిగా బ్లాక్ చేయడం లేదా టైమ్ ఫిక్స్ చేయడం వంటివి చేయవచ్చు. ఈ వీడియోలకు పిల్లలు బానిసలుగా మారుతున్నారన్న ఆందోళనల నేపథ్యంలో యూట్యూబ్ ఈ మార్పులు తీసుకొచ్చింది. దీంతోపాటు కిడ్స్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసేలా సైన్-అప్ ప్రక్రియను ఈజీ చేసింది.
News January 16, 2026
రక్షణ రంగంలోకి భారీగా FDIలకు అవకాశం!

జియో పాలిటిక్స్, పాక్ నుంచి ఉగ్రవాదం నేపథ్యంలో రక్షణ రంగంలోకి భారీగా FDIలకు అవకాశమివ్వాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం అనుమతులతో అవసరం లేని ఆటోమేటిక్ లైసెన్సింగ్ విధానంలో 49% వరకు FDIలకు అవకాశం ఉంది. దీన్ని 74% పెంచనుందని ‘రాయిటర్స్’ పేర్కొంది. భారత భాగస్వామి కంపెనీల్లో విదేశీ రక్షణ సంస్థలకు మెజార్టీ వాటాకు అవకాశం కల్పించనుంది. ఆధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడమే దీని లక్ష్యమని తెలిపింది.


