News April 19, 2024
విజయవాడ సెంట్రల్లో విజయమెవరిదో?
AP: రాష్ట్ర రాజకీయాల్లో అందరి దృష్టిని ఆకర్షించే విజయవాడ ప్రాంతంలోని కీలక నియోజకవర్గం విజయవాడ సెంట్రల్. 2008లో సెగ్మెంట్ ఏర్పడగా.. కాంగ్రెస్, TDP, YCP చెరొకసారి గెలిచాయి. 2019 ఎన్నికల్లో TDP అభ్యర్థి బోండా ఉమపై మల్లాది విష్ణు(YCP) 25 ఓట్ల తేడాతోనే గెలిచారు. ఈసారి విజయవాడ వెస్ట్ MLA వెల్లంపల్లి శ్రీనివాస్ని YCP ఇక్కడ పోటీ చేయిస్తోంది. TDP నుంచి ఉమ మరోసారి పోటీకి సై అంటున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News October 14, 2024
కొండా సురేఖపై కేటీఆర్ పిటిషన్.. విచారణ వాయిదా
TG: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ దాఖలు చేసిన పరువునష్టం దావా పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 18న కేటీఆర్తో పాటు నలుగురు సాక్షులు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్ స్టేట్మెంట్లను కోర్టు రికార్డు చేయనుంది. తదుపరి విచారణను 18కి వాయిదా వేసింది.
News October 14, 2024
టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. ప్రధాన నిందితుడు సరెండర్
AP: టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ప్రధాన నిందితుడు, MLC లేళ్ల అప్పిరెడ్డి అనుచరుడు పానుగంటి చైతన్య మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. YCP విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న చైతన్య ఈ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. కూటమి ప్రభుత్వం రాగానే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇదే కేసులో అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, దేవినేని అవినాశ్ ఇవాళ మంగళగిరి PSలో విచారణకు హాజరయ్యారు.
News October 14, 2024
క్యాన్సర్ ట్రీట్మెంట్.. కనురెప్పలు కోల్పోయిన నటి
స్టేజ్-3 బ్రెస్ట్ క్యాన్స్ర్తో బాధపడుతున్న బాలీవుడ్ నటి హీనా ఖాన్కు కీమో థెరపీ కొనసాగుతోంది. అత్యంత కఠినమైన ఈ చికిత్స సందర్భంగా ఆమె ఇప్పటికే తన జుట్టును కోల్పోయారు. తాజాగా ట్రీట్మెంట్ ఫైనల్ స్టేజ్లో తన కనురెప్పలు కూడా పోయాయంటూ ఆమె అందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. దీంతో ‘మీరొక వారియర్. త్వరలోనే కోలుకుంటారు’ అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.