News December 16, 2024
ఈసారి నేషనల్ అవార్డు వచ్చేదెవరికో!

‘పుష్ప’ సినిమాకు నేషనల్ అవార్డు గెలుచుకున్న అల్లు అర్జున్ ‘పుష్ప-2’తో మరోసారి అందుకుంటారని అభిమానులు పోస్టులు పెడుతున్నారు. అయితే, ఈ ఏడాది మరికొందరు నటులూ తమ అద్భుతమైన నటనతో మెప్పించారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ‘మహారాజ’లో విజయ్ సేతుపతి, ‘గోట్ లైఫ్’లో పృథ్వీరాజ్, ‘తంగలాన్’లో విక్రమ్ల నటన కూడా అద్భుతంగా ఉందంటున్నారు. మరి ఈ ఏడాది నేషనల్ అవార్డు ఎవరికి వస్తుందో కామెంట్ చేయండి.
Similar News
News November 19, 2025
మంగళగిరి: భార్యని హత్య చేసిన భర్త

గుంటూరు(D) మంగళగిరి పరిధి యర్రబాలెంలో వివాహిత హత్యకు గురైంది. CI బ్రహ్మం, SI వెంకట్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. వారి వివరాల మేరకు.. మచిలీపట్నంకు చెందిన కిలిమి లక్ష్మీ(29) ఐదేళ్ల క్రితం శంకర్ రెడ్డిని పెళ్ళి చేసుకుంది. కలహాలతో విడిపోయి, చినకాకానికి చెందిన వ్యక్తితో సహజీవనం చేస్తూ యర్రబాలెంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో భర్త శంకరరెడ్డి గొంతునులిమి హత్యచేశాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు.
News November 19, 2025
గ్రేటర్ తిరుపతి ఇలా..!

తిరుపతి కార్పొరేషన్ విస్తరణలో భాగంగా 63 గ్రామాలు విలీనం కానున్నాయి. తిరుపతి రూరల్ మొత్తం కార్పొరేషన్లో కలిపేస్తారు. చంద్రగిరి మండలంలోని 21 గ్రామాల్లో 13 గ్రేటర్లో కలుస్తాయి. విలీనంతో నగర జనాభా 4.52 లక్షల నుంచి 7.86 లక్షలకు చేరనుంది. ఆదాయం సైతం రూ.149 కోట్ల నుంచి రూ.192.20 కోట్లకు చేరే అవకాశముంది. ప్రస్తుతం తిరుపతి విస్తీర్ణం 30.174 చ.కిమీ ఉండగా విలీనంతో 300.404 చ.కిమీకు పెరగనుంది.
News November 19, 2025
మంగళగిరి: భార్యని హత్య చేసిన భర్త

గుంటూరు(D) మంగళగిరి పరిధి యర్రబాలెంలో వివాహిత హత్యకు గురైంది. CI బ్రహ్మం, SI వెంకట్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. వారి వివరాల మేరకు.. మచిలీపట్నంకు చెందిన కిలిమి లక్ష్మీ(29) ఐదేళ్ల క్రితం శంకర్ రెడ్డిని పెళ్ళి చేసుకుంది. కలహాలతో విడిపోయి, చినకాకానికి చెందిన వ్యక్తితో సహజీవనం చేస్తూ యర్రబాలెంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో భర్త శంకరరెడ్డి గొంతునులిమి హత్యచేశాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు.


