News September 16, 2024
బంగ్లాతో టెస్టు.. గెలిచేదెవరో?
బంగ్లాదేశ్తో ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్కు టీమ్ఇండియా సిద్ధమవుతోంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగే తొలి టెస్టులో స్పిన్నర్లు అశ్విన్, జడేజా, కుల్దీప్ జట్టులో ఆడతారని పీటీఐ పేర్కొంది. రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించనున్న ఈ జట్టులో అక్షర్ పటేల్కు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ రెండు టెస్టుల సిరీస్లో గెలిచేదెవరో కామెంట్ చేయండి.
Similar News
News September 19, 2024
ఈ ఏడాది చివరిలోపు ఐపీఎల్ వేలం?
ఐపీఎల్-2025 కోసం చేపట్టే వేలం రానున్న నవంబరు ఆఖర్లో లేదా డిసెంబరు మొదటి వారంలో ఉండొచ్చని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మరో రెండ్రోజుల్లో అందుకు సంబంధించిన నిబంధనల్ని రూపొందించనున్నట్లు పేర్కొన్నాయి. గత రెండు ఆక్షన్లలాగే ఈసారి కూడా వేలం 2 రోజుల పాటు జరుగుతుందని సమాచారం. ఆటగాళ్ల కొనసాగింపు విషయంలో జట్ల మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్న నేపథ్యంలో నిబంధనలెలా ఉండనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.
News September 19, 2024
Learning English: Synonyms
✒ Fast: Quick, Rapid, Hasty
✒ Fat: Stout, Corpulent, Paunchy
✒ Fear: Fright, Dread, Terror, Alarm
✒ Fly: Soar, Hover, Flit, Wing
✒ Funny: Humorous, Amusing
✒ Get: Acquire, Obtain, Secure
✒ Go: Recede, Depart, Fade
✒ Good: Excellent, Apt, Marvelous
✒ Great: Noteworthy, Worthy
News September 19, 2024
5,600 మంది ఉద్యోగులపై ‘సిస్కో’ వేటు
ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా 4వేల మంది ఉద్యోగులను తొలగించిన టెక్ దిగ్గజం సిస్కో మరో దశ లేఆఫ్స్కు సిద్ధమైంది. మొత్తం వర్క్ఫోర్స్లో 7 శాతం(5,600) సిబ్బందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. అయితే ఏయే విభాగాలు ప్రభావితం అవుతాయో వెల్లడించలేదు. కాగా అక్కడ పని వాతావరణం ఏమాత్రం బాగాలేదని పలు నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు ఆ కంపెనీ వార్షిక ఆదాయం రికార్డు స్థాయిలో $54 బిలియన్లకు చేరింది.