News April 4, 2024
గురజాల యుద్ధంలో గెలుపెవరిదో?
AP: పౌరుషానికి ప్రతీక పల్నాడు(D) గురజాల. గతంలో పల్నాడు యుద్ధం ఈ ప్రాంతంలోనే జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ 6, TDP 5సార్లు, CPI, YCP ఒక్కోసారి గెలిచాయి. TDP నుంచి Ex MLA యరపతినేని శ్రీనిసరావు(3సార్లు MLA) ఏడోసారి బరిలోకి దిగుతున్నారు. YCP నుంచి మాజీ CM కాసు బ్రహ్మానందరెడ్డి మనుమడు కాసు మహేశ్ మరోసారి పోటీ చేస్తున్నారు. లోకల్ మేనిఫెస్టోతో ఇద్దరు నేతలు రాజకీయాన్ని హీటెక్కిస్తున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News October 7, 2024
సమోసాలు, చిప్స్, కుకీలతో మధుమేహం!
సమోసాలు, చిప్స్, కుకీలు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ మధుమేహానికి దారితీస్తున్నట్టు ICMR-MDRF పరిశోధనలో తేలింది. అధిక ఉష్ణోగ్రతలో వండే ఈ పదార్థాల్లో అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్(AGEs) అధికంగా ఉంటాయి. ప్రొటీన్లు, గ్లూకోజ్ గ్లైకేషన్ ద్వారా ఇది ఏర్పడుతుంది. అధిక AGEs పదార్థాలు టైప్2 డయాబెటిస్కు కారణమని వైద్యులు చెబుతున్నారు. వేయించిన ఆహారాన్ని తినడం తగ్గించాలని సూచిస్తున్నారు.
News October 7, 2024
రూ.35,000 కోసం పెళ్లి చేసుకున్న అన్నాచెల్లెళ్లు!
ప్రభుత్వం అమలు చేస్తున్న సామూహిక వివాహ పథకం ప్రయోజనాలు (రూ.35,000) పొందడం కోసం అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్న ఘటన యూపీలో జరిగింది. ఈ ఏడాది మార్చి 5న ఈ ఘటన జరగగా, స్థానికుల సమాచారంతో అధికారులు తాజాగా చర్యలకు ఉపక్రమించారు. యువతికి ఇదివరకే వివాహం జరగగా, డబ్బుల కోసం మరోసారి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశారు. వరుడు సమయానికి రాకపోవడంతో వధువు, ఆమె సోదరుడు పెళ్లి చేసుకున్నారు.
News October 7, 2024
గ్రూప్-4 అభ్యర్థులకు GOOD NEWS!
TG: గ్రూప్-4 పరీక్ష ఫైనల్ సెలక్షన్ ప్రక్రియను త్వరలోనే చేపడతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఇవాళ కొంతమంది అభ్యర్థులు మంత్రిని కలిసి తమ సమస్యను విన్నవించారు. తుమ్మల TGPSC ఛైర్మన్ మహేందర్ రెడ్డికి కాల్ చేసి.. తుది ఫలితాలను వెంటనే ప్రకటించాలని కోరారు. కాగా, 2023లో గ్రూప్-4 పరీక్షలు నిర్వహించగా, 45 రోజుల క్రితం సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయింది. కానీ నియామక ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది.