News November 3, 2024
ఈ పరాభవం తప్పెవరిది?

భారత్ తొలిసారి సొంతగడ్డపై 3-0తో టెస్ట్ సిరీస్ కోల్పోయి ఘోర పరాభవాన్ని చవిచూసింది. దీంతో గౌతం గంభీర్ కోచింగ్పై, రోహిత్శర్మ కెప్టెన్సీతో పాటు ఆటగాళ్ల పేలవ ప్రదర్శనపైనా తీవ్ర విమర్శలొస్తున్నాయి. సిరీస్కు ముందు ‘అవసరమైతే టెస్టుల్లో ఒకేరోజు 400 కొడతాం, 2 రోజులు బ్యాటింగ్ చేస్తాం’ అని గంభీర్ చెప్పిన మాటలు చేతల్లో కనిపించలేదు. రోహిత్ కెప్టెన్సీలోనూ పస కనిపించలేదు. తప్పెవరిదని మీరు భావిస్తున్నారు?
Similar News
News December 31, 2025
గ్రీటింగ్ లింకులతో ‘జర భద్రం’: వరంగల్ సీపీ

నూతన సంవత్సర వేడుకల వేళ సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. న్యూ ఇయర్ విషెస్ పేరుతో వాట్సాప్, సోషల్ మీడియాలో వచ్చే అపరిచిత లింకులను క్లిక్ చేయవద్దని కోరారు. ఆకర్షణీయమైన గ్రీటింగ్స్ లింక్ ల ద్వారా ఫోన్లను హ్యాక్ చేసి, బ్యాంకు ఖాతాల నుంచి సొమ్ము దోచేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అనుమానాస్పద లింకులు వస్తే వెంటనే డిలీట్ చేయాలని సీపీ కోరారు.
News December 31, 2025
మహిళలకు అత్యంత అనుకూలమైన దేశం డెన్మార్క్

ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ (WPS) ఇండెక్స్-2025లో మహిళలకు అత్యంత అనుకూలమైన దేశంగా డెన్మార్క్ అగ్ర స్థానంలో నిలిచింది. ఉద్యోగ, ఉపాధితోపాటు ప్రతి రంగంలోనూ ఇక్కడి మహిళలకు విస్తృతమైన అవకాశాలు, భద్రత లభిస్తోంది. లింగవివక్ష, మహిళలపై హింస ఉండవు. కీలక నిర్ణయాల్లో మహిళల ప్రాతినిధ్యం, బలమైన చట్టాలు, సురక్షిత వాతావరణం, ఆరోగ్యం-చదువులో ఉన్నత ఫలితాలు సాధించడం వంటివి దీన్ని లెక్కించే సూచికలు.
News December 31, 2025
కోటిన్నర ఎకరాలకు రైతు భరోసా!

TG: గత సీజన్లో ఇచ్చినట్లుగానే ఈసారి కోటిన్నర ఎకరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. యాసంగి సీజన్ పెట్టుబడి సాయం కింద సంక్రాంతి నాటికి రైతు భరోసా నగదు రైతు ఖాతాల్లో జమ చేసే యోచనలో ఉంది. సాగు భూములకు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఇప్పటికీ ఆ లెక్కలు తేలలేదు. ఈ పథకం ద్వారా ఎకరానికి రూ.6వేల చొప్పున ఏడాదికి రెండు విడతల్లో నగదు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.


