News August 14, 2024
అభిషేక్ మను సింఘ్వీనే ఎందుకు?

హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో అభిషేక్ మను సింఘ్వీ ఓడిపోయినా కాంగ్రెస్ అయనకు మళ్లీ అవకాశం ఇచ్చింది. సింఘ్వీ ప్రముఖ న్యాయవాది. పార్టీకి సంబంధించిన న్యాయపరమైన అంశాలను ఆయనే చూసుకుంటారు. కపిల్ సిబల్ కాంగ్రెస్ను వీడడంతో పార్టీలో న్యాయ నిపుణుల లోటు ఏర్పడింది. దీంతో పార్టీకి సింఘ్వీ అవసరం చాలా ఉండడంతో మళ్లీ తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిత్వం దక్కినట్టు తెలుస్తోంది.
Similar News
News December 5, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇస్రో-<
News December 5, 2025
ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.
News December 5, 2025
పీజీ సెట్ రాయకపోయినా అడ్మిషన్

AP: MA, M.Sc, M.Com కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది పీజీ సెట్ అర్హతను మినహాయించింది. పీజీ సెట్ అర్హత సాధించకపోయినా, సెట్ రాయకపోయినా స్పాట్ కోటా కింద అడ్మిషన్లు చేపట్టేందుకు అవకాశం కల్పించింది. వర్సిటీలు, కాలేజీల్లో మిగిలిన కన్వీనర్ కోటా సీట్లను ఈ స్పాట్ కోటా కింద ఫిల్ చేయాలని ఆదేశించింది. ఈ కోటాలో చేరే విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ వర్తించదు.


