News August 14, 2024

అభిషేక్ మ‌ను సింఘ్వీనే ఎందుకు?

image

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో అభిషేక్ మ‌ను సింఘ్వీ ఓడిపోయినా కాంగ్రెస్ అయనకు మ‌ళ్లీ అవకాశం ఇచ్చింది. సింఘ్వీ ప్రముఖ న్యాయవాది. పార్టీకి సంబంధించిన న్యాయ‌ప‌ర‌మైన అంశాల‌ను ఆయ‌నే చూసుకుంటారు. క‌పిల్ సిబ‌ల్ కాంగ్రెస్‌ను వీడడంతో పార్టీలో న్యాయ నిపుణుల లోటు ఏర్పడింది. దీంతో పార్టీకి సింఘ్వీ అవసరం చాలా ఉండడంతో మళ్లీ తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిత్వం దక్కినట్టు తెలుస్తోంది.

Similar News

News December 9, 2025

నిర్మల్: ఒకే పేరు.. రెండేసి పంచాయతీలు

image

ఒకే పేరుతో రెండేసి గ్రామాలు ఒకే దగ్గర ఉండడం చాలా అరుదు. కానీ నిర్మల్ జిల్లా కడెం మండలంలో ఇలా రెండు గ్రామాలు పక్కపక్కనే ఉన్నాయి. మండలంలోని కొండుకూర్ పంచాయతీ పక్కనే పాత కొండుకూర్, బెల్లాల్-పెద్దబెల్లాల్, ధర్మాజీపేట్-కొత్త ధర్మాజీపేట్, మద్దిపడగ-కొత్త మద్దిపడగ పేర్లతో గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దీంతో ఎన్నికల వేళ అభ్యర్థులు ఊరిపేర్లతో కాస్తా ఇబ్బంది పడుతున్నారు.

News December 9, 2025

నిర్మల్: ఒకే పేరు.. రెండేసి పంచాయతీలు

image

ఒకే పేరుతో రెండేసి గ్రామాలు ఒకే దగ్గర ఉండడం చాలా అరుదు. కానీ నిర్మల్ జిల్లా కడెం మండలంలో ఇలా రెండు గ్రామాలు పక్కపక్కనే ఉన్నాయి. మండలంలోని కొండుకూర్ పంచాయతీ పక్కనే పాత కొండుకూర్, బెల్లాల్-పెద్దబెల్లాల్, ధర్మాజీపేట్-కొత్త ధర్మాజీపేట్, మద్దిపడగ-కొత్త మద్దిపడగ పేర్లతో గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దీంతో ఎన్నికల వేళ అభ్యర్థులు ఊరిపేర్లతో కాస్తా ఇబ్బంది పడుతున్నారు.

News December 9, 2025

రాజమండ్రి: ప్లాస్టిక్ రహిత నగరం వైపు.. ‘రీసైక్లింగ్ లీగ్’

image

RJYలో ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణే లక్ష్యంగా నగరపాలక సంస్థ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో ‘ప్లాస్టిక్ రీసైక్లింగ్ లీగ్’ పోస్టర్‌ను కమిషనర్ రాహుల్ మీనా ఆవిష్కరించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే ముప్పుపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు లీగ్ దోహదపడుతుందన్నారు. విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు.