News March 31, 2024
ఇప్పుడు మళ్లీ ఎందుకు బిందెలు వచ్చాయి?: కేసీఆర్

తమ పాలనలో లేని ట్యాంకర్లు, బిందెలు ఇప్పుడు ఎందుకు బయటికొచ్చాయంటూ మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ‘రూపాయికే నల్లా కనెక్షన్, ఫ్రీ వాటర్ ఇచ్చాం. 35వేల కోట్లు ఖర్చుపెట్టి విద్యుత్ రంగాన్ని బాగుచేశాం. 24 గంటలూ కరెంట్ ఇచ్చాం. స్పష్టంగా అర్థమయ్యేదేంటంటే అధికార పార్టీ అవివేకం, తెలివితక్కువతనం, అవగాహనారాహిత్యం క్లియర్గా కనిపిస్తోంది. ఉన్న కరెంటును, మిషన్ భగీరథను వాడే తెలివి లేదు’ అని మండిపడ్డారు.
Similar News
News January 27, 2026
భారత్-EU ఒప్పందాలపై ప్రధాని ట్వీట్

ఇండియా- యురోపియన్ యూనియన్ (EU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం ఒక కీలక మైలురాయి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ ఒప్పందం ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా పెట్టుబడులు & ఉపాధికి కొత్త మార్గాలను తెరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యూరప్ నేతలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ భాగస్వామ్యం ఉజ్వల భవిష్యత్తుకు పునాది అని ట్వీట్ చేశారు. ఈ చరిత్రాత్మక అడుగుతో IND-యూరప్ మధ్య సహకారం మరింత పెరగనుంది.
News January 27, 2026
భారత్ భారీ స్కోర్

ఐసీసీ U19 వన్డే వరల్డ్ కప్లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్లో భారత్ 352-8 స్కోర్ చేసింది. విహాన్ సెంచరీ(109*) బాదగా, అభిజ్ఞాన్ కుందు 61, వైభవ్ సూర్యవంశీ 52, ఆరోన్ 23, కెప్టెన్ ఆయుష్ మాత్రే(21), అంబ్రిష్ 21, ఖిలాన్ పటేల్ 30 రన్స్ చేశారు. కాగా గ్రూప్ స్టేజీలో హ్యాట్రిక్ విజయాలతో యంగ్ ఇండియా జోరుమీదున్న విషయం తెలిసిందే.
News January 27, 2026
19 ఇరిగేషన్ ప్రాజెక్టులకు మహర్దశ

AP: ప్రాధాన్యత వారీగా ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తిచేయాలని CM ఆదేశించడం తెలిసిందే. ఇందుకు సంబంధించి అధికారులు 19 ప్రాజెక్టులను ఎంపిక చేశారు. వెలిగొండ, కొరిశపాడు, పాలేరు, మల్లెమడుగు, శ్రీబాలాజీ రిజర్వాయర్ వీటిలో ఉన్నాయి. కుప్పం, మడకశిర బ్రాంచ్ కెనాళ్లు, మూలపల్లి, హంద్రీనీవా, అట్లూరుపాడు, భైరవానితిప్ప, జీడిపల్లి అప్పర్ పెన్నార్, అన్నమయ్య, వేదవతి-గాజుల దిన్నెవంటి ప్రాజెక్టులను ముందు పూర్తి చేస్తారు.


