News February 13, 2025

జట్టులో అంతమంది స్పిన్నర్లు ఎందుకు?: అశ్విన్

image

ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడంపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విస్మయం వ్యక్తం చేశారు. ‘ఒక టూర్‌లో ముగ్గురు లేదా నలుగురు స్పిన్నర్లంటే అర్థం చేసుకోవచ్చు. కానీ మరీ ఐదుగురు స్పిన్నర్లా..? అది కూడా దుబాయ్ పిచ్‌లో ఆడేందుకు? మరీ ఎక్కువమందిని తీసుకున్నారనిపిస్తోంది. జడేజా, అక్షర్, కుల్‌దీప్, వరుణ్, సుందర్‌లో ఎవర్ని ఆడిస్తారు? ఎవర్ని పక్కన పెడతారు?’ అని ప్రశ్నించారు.

Similar News

News February 13, 2025

వంశీపై ముగిసిన విచారణ.. ఆస్పత్రికి తరలింపు

image

AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కృష్ణలంక స్టేషన్లో పోలీసుల విచారణ ముగిసింది. 8గంటల పాటు అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. ప్రస్తుతం ఆయన్ను పీఎస్ నుంచి ప్రభుత్వాసుపత్రికి(జీజీహెచ్‌)కు వైద్య పరీక్షల నిమిత్తం తరలిస్తున్నారు. అనంతరం మేజిస్ట్రేటు వద్ద హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది.

News February 13, 2025

ప్రియుడి నుంచి వేధింపులు ఎదుర్కొన్నా: ఐశ్వర్యా రాజేశ్

image

చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లికి అండగా ఉండేందుకు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసినట్లు హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ చెప్పారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో ఓ వ్యక్తిని ఇష్టపడినట్లు తెలిపారు. తర్వాత అతడి నుంచి వేధింపులను ఎదుర్కొన్నానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. లవ్ కంటే అది బ్రేకప్ అయినప్పుడు వచ్చే బాధ అంటే తనకెంతో భయమన్నారు. గత అనుభవాల వల్ల ప్రేమలో పడాలంటే ఆలోచిస్తున్నానని పేర్కొన్నారు.

News February 13, 2025

రాష్ట్రపతి పాలనలో మణిపుర్ రికార్డు

image

అత్యధికసార్లు(11) రాష్ట్రపతి పాలనలో ఉన్న రాష్ట్రంగా మణిపుర్ రికార్డుల్లోకి ఎక్కింది. ఆ తర్వాతి స్థానాల్లో UP(10), J&K(9) బిహార్(8), పంజాబ్(8) ఉన్నాయి. రోజుల(4,668) పరంగా J&K టాప్‌లో ఉంది. ఆ తర్వాత పంజాబ్(3,878), పాండిచ్చేరి(2,739) ఉన్నాయి. 1951లో తొలిసారిగా పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. ఇప్పటికి 29 రాష్ట్రాలు/UTలలో 134సార్లు విధించారు. TG, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కసారీ ప్రెసిడెంట్ రూల్ రాలేదు.

error: Content is protected !!