News December 15, 2024
జట్టును ఎందుకలా మారుస్తున్నారు?: ఆకాశ్ చోప్రా

ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్ ఇండియా ఒక్కో మ్యాచ్కు ఒక్కో స్పిన్నర్ను ఆడించడంపై కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రతి మ్యాచ్లోనూ కొత్త స్పిన్నర్ను ఆడించాలని జట్టు మేనేజ్మెంట్ చూస్తున్నట్లుంది. తొలి మ్యాచ్లో సుందర్, రెండో మ్యాచ్లో అశ్విన్, ప్రస్తుత మ్యాచ్లో జడేజా. కుల్దీప్ జట్టులో ఉండి ఉంటే నాలుగోమ్యాచ్కు అతడ్ని ఆడించేవారేమో! అసలు అవసరం లేని మార్పులివి’ అని తేల్చిచెప్పారు.
Similar News
News December 3, 2025
చిన్న తప్పుతో రూ.లక్షలు కోల్పోతున్నారు!

సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్తో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే ‘FLAT SIP’ హ్యాబిట్తో రూ.లక్షలు కోల్పోతారని నిపుణులు చెబుతున్నారు. ‘ఎప్పుడూ ఒకే అమౌంట్ని ఇన్వెస్ట్ చేయకూడదు. పెట్టుబడి మొత్తంలో ఏడాదికి కనీసం 10% పెంచాలి. Ex: నెలకు ₹10వేలు చొప్పున 20ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే (12% రిటర్న్స్తో) ₹99 లక్షలొస్తాయి. అదే ఏటా 10% పెంచుకుంటూ పోతే ₹1.5కోట్ల వరకు వస్తాయి’ అని వివరిస్తున్నారు.
News December 3, 2025
స్టేడియాల్లో సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉందా?

తమ ఆరాధ్య క్రికెటర్లను కలిసేందుకు ఫ్యాన్స్ వెర్రెత్తి పోతున్నారు. గ్రౌండ్లలోకి దూసుకెళ్లి ప్లేయర్ల కాళ్లపై పడుతున్నారు. మొన్న కోహ్లీ, నిన్న హార్దిక్పై ఫ్యాన్స్ విపరీత అభిమానం చూపారు. దీంతో జాతీయ స్థాయి ప్లేయర్లు ఆడే స్టేడియాల్లో సెక్యూరిటీపై క్రీడా వర్గాల నుంచి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇలా దూసుకొచ్చేవారి వల్ల ఆటగాళ్లకు ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? అని నిలదీస్తున్నాయి. మీరేమంటారు?
News December 3, 2025
యుద్ధానికి మేము సిద్ధం: పుతిన్

గతంలో చెప్పినట్లు యూరప్ దేశాలతో యుద్ధం చేయాలని రష్యా కోరుకోవట్లేదని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. ఒకవేళ తమపై పోరాటం చేస్తామంటే యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు. ఉక్రెయిన్ వార్ ముగించడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను ఆ దేశాలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. రష్యాకు ఆమోదయోగ్యంకాని ప్రతిపాదనలు తెచ్చి శాంతి ఒప్పందానికి తూట్లు పొడుస్తున్నాయన్నారు. వాటికి శాంతియుత ఎజెండా లేదని ఆరోపించారు.


