News August 9, 2024
విజయవాడపై ఎందుకు నీకంత పగ చంద్రబాబు?: YCP

AP: విజయవాడలో అంబేడ్కర్ విగ్రహాన్ని కూల్చేందుకు సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైసీపీ మండిపడింది. ‘విజయవాడపై ఎందుకు నీకు ఇంత పగ చంద్రబాబు? అప్పట్లో బెజవాడ పరిసరాల్లో 40 గుడులను కూల్చావు. ఐదేళ్లలో ఎవరూ ఊహించని విధంగా జగన్ బెజవాడ రూపురేఖల్ని మార్చారు. అది జీర్ణించుకోలేకనే కదా ఇలా విధ్వంసాలకు పాల్పడుతున్నావ్?’ అని ట్వీట్ చేసింది. చంద్రబాబు, జగన్ ఫొటోలను షేర్ చేసింది.
Similar News
News November 15, 2025
APPLY NOW: RRUలో 9 పోస్టులు

గుజరాత్లోని రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ<
News November 15, 2025
మొత్తం పెట్టుబడులు రూ.13 లక్షల కోట్లు: CBN

AP: CII సదస్సు ద్వారా రూ.13లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని CM CBN ప్రకటించారు. గత 18నెలల్లో ఇన్వెస్ట్మెంట్స్ రూ.22లక్షల కోట్లకు చేరాయన్నారు. శ్రీసిటీలో మరికొన్ని యూనిట్లను ఆయన వర్చువల్గా ప్రారంభించారు. 12 ప్రాజెక్టుల ఏర్పాటుకు కంపెనీలతో MoUలు కుదుర్చుకున్నారు. వీటి ద్వారా 12,365 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. 2028 నాటికి శ్రీసిటీని ఉత్తమ పారిశ్రామిక ప్రాజెక్టుగా మారుస్తామని స్పష్టం చేశారు.
News November 15, 2025
మిరప పంటకు వేరు పురుగుతో తీవ్ర నష్టం

వేరు పురుగులు మిరప పంటను ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తాయి. బాగా పెరిగిన వేరు పురుగు ‘సి(C)’ ఆకారంలో ఉండి మొక్క వేర్లపై దాడి చేసి నాశనం చేస్తాయి. పిల్ల పురుగులు మొక్కల వేర్లను కత్తిరించడం వల్ల మొక్క పాలిపోతుంది. కొన్ని రోజుల వ్యవధిలో పూర్తిగా ఎండిపోతుంది. దీని ఉద్ధృతి ఎక్కువగా ఉంటే మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి. దీని వల్ల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడి రైతులు ఆర్థికంగా నష్టపోతారు.


