News August 22, 2024
సెబీ కుంభకోణంపై BRS ఎందుకు మాట్లాడట్లేదు: రేవంత్

ఈ దేశానికి బీజేపీ ముప్పుగా మారిందని సీఎం రేవంత్ విమర్శించారు. మోదీపై కొట్లాడుతున్నామని BRS చెబుతోందని, అలా అయితే సెబీ కుంభకోణంపై ఆ పార్టీ ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. ‘ప్రతి చిన్నదానిపై స్పందించే కేటీఆర్ అదానీ వ్యవహారంపై ఎందుకు మాట్లాడట్లేదు. బీజేపీకి BRS అనుకూలంగా ఉన్నారనేందుకు ఇదే స్పష్టమైన సాక్ష్యం. మోదీ, అమిత్ షాను సంతోషపర్చడానికి రాజీవ్ విగ్రహం తొలగిస్తామంటున్నారు’ అని ఫైరయ్యారు.
Similar News
News November 27, 2025
భారత్ వైట్ వాష్.. తప్పెవరిది?

SAతో 2 టెస్టుల్లోనూ ఘోరంగా ఓడిపోవడాన్ని భారత ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. బ్యాటర్ల డిఫెన్స్ టెక్నిక్ పేలవంగా ఉందని, T20 ఫార్మాట్ అలవాటై గంటల కొద్దీ బ్యాటింగ్ చేసే ఓపిక నశించిందని అంటున్నారు. అటు ఎక్కువశాతం కోచ్ గంభీర్పై ఫైర్ అవుతున్నారు. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు, టీం సెలక్షన్ సరిగా చేయలేకపోతున్నారనే విమర్శలొస్తున్నాయి. ఇంతకీ వైట్ వాష్కి కారణం ప్లేయర్లా, కోచ్ గంభీరా? కామెంట్ చేయండి.
News November 27, 2025
ఆవు పేడతో అలుకుత ఎందుకు చల్లాలి?

పూజలు, శుభకార్యాల సమయంలో ఆవు పేడతో అలుకుత చల్లే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. అయితే దీని వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. నిజానికి ఆవు పేడ ఒక అద్భుతమైన క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది. కీటకాలను దూరం చేసే సహజ సిద్ధమైన పరిష్కారంగా దీన్ని భావిస్తారు. అప్పట్లో రసాయన క్రిమిసంహారకాలు ఉండేవి కాదు. అందుకే ఆ రోజుల్లో నేలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి, సానుకూల శక్తిని నింపడానికి ఈ పద్ధతిని ఆచరించేవారు.
News November 27, 2025
నేటి నుంచి వైకుంఠద్వార దర్శనాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్

AP: ఇవాళ 10AM నుంచి వైకుంఠద్వార దర్శనం టోకెన్ల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుందని TTD ఛైర్మన్ BR నాయుడు తెలిపారు. మొదటి 3 రోజుల దర్శన టోకెన్ల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. DEC 1 వరకు TTD వెబ్సైట్, మొబైల్ యాప్, ప్రభుత్వ WhatsApp సర్వీసెస్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. DEC 2న ఈ-డిప్లో ఎంపికైన భక్తుల ఫోన్లకు టోకెన్ వివరాలు మెసేజ్ ద్వారా అందుతాయని చెప్పారు.


