News April 24, 2024
చాహల్ను అందుకే రిటైన్ చేసుకోలేదు: మైక్

IPL-2022 సీజన్లో ముగ్గురినే రిటైన్ చేసుకునే అవకాశం ఉండటంతో యుజ్వేంద్ర చాహల్ను రిటైన్ చేసుకోలేకపోయామని RCB మాజీ డైరెక్టర్ మైక్ హసన్ తెలిపారు. ‘వేలంలో చాహల్ పేరు ఆలస్యంగా రావడంతో అక్కడ కూడా ఆయనను దక్కించుకోలేకపోయాం. ఆయన వేలంలోకి రాకముందే హసరంగను తీసుకున్నాం. చాహల్తోపాటు హర్షల్ను కూడా దక్కించుకోలేకపోయాం’ అని ఆయన పేర్కొన్నారు. కాగా IPLలో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్గా చాహల్ చరిత్ర సృష్టించారు.
Similar News
News December 31, 2025
న్యూఇయర్ వేళ మళ్లీ తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో న్యూఇయర్ వేళ బంగారం ధరలు గంటల వ్యవధిలోనే <<18719998>>మళ్లీ<<>> తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ మొత్తం రూ.980 తగ్గి రూ.1,35,220కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.900 పతనమై రూ.1,23,950 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,58,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 31, 2025
ఒక్కరితో ఆపొద్దు.. ఇద్దరు ముగ్గురికి జన్మనివ్వండి: అస్సాం CM

హిందూ జంటలు ఒక్క సంతానంతో ఆపొద్దని, ఇద్దరిని కనాలని అస్సాం CM హిమంత బిశ్వ శర్మ కోరారు. అవకాశం ఉన్నవాళ్లు ముగ్గురికి జన్మనివ్వాలన్నారు. రాష్ట్రంలో హిందువుల బర్త్ రేట్ తగ్గుదల ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జననాల రేటు ఎక్కువగా ఉందన్నారు. 7-8 మంది పిల్లల్ని కనొద్దని ముస్లింలను కోరారు. AP CM CBN కూడా ఇద్దరు/ముగ్గురు పిల్లల్ని కనాలని కోరుతున్న విషయం తెలిసిందే.
News December 31, 2025
అతిపెద్ద జిల్లాగా కడప

ఏపీలో జిల్లాల పునర్విభజనతో విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లాగా కడప నిలిచింది. గతంలో అనంతపురం తొలి స్థానంలో ఉండేది. రాజంపేట నియోజకవర్గం జిల్లాలో చేరడంతో 12,507 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో భూభాగ పరంగా మొదటి, 22.96 లక్షల ప్రజలతో జనాభా పరంగా రెండోస్థానంలో ఉందని అధికారులు తెలిపారు. జనాభా పరంగా చూస్తే 3,49,953 మందితో పోలవరం చివరి స్థానంలో ఉండే అవకాశముంది. కొత్త జిల్లాలపై పూర్తి గణాంకాలు తెలియాల్సి ఉంది.


