News August 19, 2024
నీరజ్.. 4 ఫౌల్స్ ఎందుకు చేశారంటే?

జావెలిన్ త్రోలో 92.97 మీటర్లతో పాకిస్థానీ నదీమ్ స్వర్ణం సాధించారు. అతడి రికార్డును బద్దలు కొట్టేందుకు నీరజ్ శక్తివంచన లేకుండా శ్రమించాడని 3సార్లు పారాలింపిక్స్ విజేత దేవేంద్ర ఝఝారియా అన్నారు. 93 మీటర్లు ఈటెను విసిరేందుకు ట్రై చేయడంతోనే తర్వాత నాలుగు ప్రయత్నాల్లో అతడు ఫౌల్ అయ్యారని తెలిపారు. రెండో దఫాలోనే 89 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచిన అతడు స్వర్ణం కోసం ప్రయత్నించడం సబబేనని వివరించారు.
Similar News
News September 17, 2025
PM AI వీడియో తొలగించండి: పట్నా హైకోర్టు

ప్రధాని మోదీని ఆయన తల్లి మందలిస్తున్నట్టు రూపొందించిన <<17688399>>AI వీడియోను<<>> సోషల్ మీడియా నుంచి తొలగించాలని బిహార్లోని పట్నా హైకోర్టు కాంగ్రెస్ పార్టీని ఆదేశించింది. SEP 10న బిహార్ కాంగ్రెస్ మోదీపై AI వీడియో క్రియేట్ చేసి Xలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీన్ని బీజేపీ, NDA మిత్ర పక్షాలు తీవ్రంగా ఖండించాయి. దీనిపై బీజేపీ ఢిల్లీ ఎలక్షన్ సెల్ వేసిన పిటిషన్ను విచారించిన కోర్టు వీడియో తొలగించాలని ఆదేశించింది.
News September 17, 2025
గ్రూప్-1పై డివిజన్ బెంచ్కు టీజీపీఎస్సీ

TG: గ్రూప్-1 మెయిన్స్ <<17655670>>ఫలితాలను<<>> రద్దుచేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్లో సవాల్ చేసింది. ఈ నెల 9న ఫలితాలను రద్దు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
News September 17, 2025
GST సంస్కరణలతో వారికి మేలు: సత్యకుమార్

AP: జీఎస్టీ సంస్కరణలు మధ్యతరగతి, పేదలకు మేలు చేసేలా ఉన్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ మార్పులతో ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంచి, వస్తువుల ధరలు నియంత్రణలోకి వస్తాయని తెలిపారు. 2047నాటికి భారత్ను 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు కేంద్రం శ్రమిస్తోందన్నారు. గత ఐదేళ్లలో దివాళా తీసిన రాష్ట్ర ఎకానమీని కూటమి ప్రభుత్వం గాడిన పెడుతోందని తెలిపారు.