News May 30, 2024
నవీన్ పట్నాయక్పై బీజేపీ కేసులెందుకు పెట్టలేదు?: రాహుల్
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్పై బీజేపీ ఎందుకు ఒక్కకేసూ పెట్టలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ‘నేను బీజేపీతో పోరాడుతున్నాను. వారు నాపై 24పైగా కేసులు పెట్టించారు. వాటిలో పరువు నష్టం, క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. నా లోక్సభ సభ్యత్వమూ లాక్కున్నారు. కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈడీ నన్ను 50 గంటల పాటు విచారించింది. పట్నాయక్పై ఏ కేసులూ లేవు ఎందుకు?’ అని రాహుల్ ప్రశ్నించారు.
Similar News
News October 15, 2024
ప్లేయర్ ఆఫ్ ద మంత్గా మెండిస్
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా శ్రీలంక ఆటగాడు కమిందు మెండిస్ నిలిచారు. సెప్టెంబర్లో అద్భుత ప్రదర్శన చేసినందుకుగానూ ఆయనను ఈ అవార్డు వరించింది. కాగా ఈ ఏడాది ఆయన రెండు సార్లు ఈ పురస్కారం అందుకున్నారు. గతంలో టీమ్ ఇండియా క్రికెటర్ శుభ్మన్ గిల్ మాత్రమే ఒక క్యాలెండర్ ఇయర్లో రెండు సార్లు ఈ అవార్డు దక్కించుకున్నారు. ఇప్పుడు మెండిస్ కూడా ఆయన సరసన చేరారు.
News October 15, 2024
ఆ కేసులను ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ చేయాలి: CM
AP: శ్రీసత్యసాయి(D) నల్లబొమ్మనిపల్లిలో అత్తాకోడళ్లపై సామూహిక <<14338493>>అత్యాచారం<<>> కేసును ప్రత్యేక కోర్టు ద్వారా విచారించాలని CM చంద్రబాబు ఆదేశించారు. ఈ కేసు విచారణపై అధికారులతో సమీక్షించారు. గతంలో బాపట్లలో మహిళపై సామూహిక హత్యాచారం ఘటనపైనా ప్రత్యేక కోర్టు ద్వారా విచారించాలని, నిందితులకు వెంటనే శిక్ష పడేలా చేయాలన్నారు. హైకోర్టుకు విన్నవించి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేద్దామన్నారు.
News October 15, 2024
ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే సహించను: చంద్రబాబు
AP: మద్యం దుకాణాల్లో వాటాల కోసం అరాచకాలు సృష్టిస్తే సహించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. మద్యం, ఇసుక విషయంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ విధానానికి కట్టుబడి ఉండాలని చెప్పారు. ‘వైన్ షాపులు గెలుపొందిన వారు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా వాటాల కోసం బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ఆయన అధికారులను ఆదేశించారు.