News March 18, 2025

NTR జిల్లా పేరు ఎందుకు మార్చలేదు?: షర్మిల

image

AP: చంద్రబాబు తీరు అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు ఉందని షర్మిల అన్నారు. ‘NTR పేరును జగన్ మారిస్తే, YSR పేరు మార్చి CBN ప్రతీకారం తీర్చుకుంటున్నారు. YSR జిల్లాను YSR కడప జిల్లాగా సవరించడంలో అభ్యంతరం లేదు. తాడిగడప మున్సిపాలిటీకి YSR పేరును తొలగించడాన్ని ఖండిస్తున్నాం. NTR జిల్లా పేరును NTR విజయవాడగా లేదా పాత కృష్ణా జిల్లా పేరును NTR కృష్ణా జిల్లాగా ఎందుకు మార్చలేదు?’ అని ప్రశ్నించారు.

Similar News

News December 18, 2025

అసభ్యంగా నివేద ఫొటోలు.. స్పందించిన హీరోయిన్

image

AI జనరేటెడ్ ఫొటోల <<18592227>>బెడద<<>> హీరోయిన్లను పట్టి పీడిస్తోంది. తాజాగా నివేదా థామస్ ఫొటోలను అసభ్యకరంగా మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనిపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఇది తన గోప్యతపై దాడి అంటూ ట్వీట్ చేశారు. వీటిని పోస్ట్ చేసినవారు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే చట్టపరంగా చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. కాగా ఇటీవల పలువురు హీరోయిన్ల ఫొటోలూ ఇలాగే వైరల్ అయ్యాయి.

News December 18, 2025

నేడు మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం!

image

TG: మరో ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ నేడు తీర్పు ప్రకటించే అవకాశం ఉంది. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలె యాదయ్య, సంజయ్‌‌పై దాఖలైన పిటిషన్లపై విచారణ ఇప్పటికే ముగిసింది. మరోవైపు దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లపై విచారణ ఇంకా పూర్తి కాలేదు. కాగా ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు ఆధారాల్లేవని <<18592868>>అనర్హత<<>> పిటిషన్లను స్పీకర్ కొట్టేసిన విషయం తెలిసిందే.

News December 18, 2025

పౌరసత్వం వదులుకుంటున్న భారతీయులు

image

భారత పౌరసత్వాన్ని వదులుకుని విదేశాలకు వెళ్లే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. గత ఐదేళ్లలో దాదాపు 9 లక్షల మంది భారతీయులు పౌరసత్వం వదులుకున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. 2022 నుంచి ఏడాదికి 2లక్షలకు పైగా భారతీయులు దేశాన్ని వీడారు. వీరిలో సంపన్నులు, నిపుణులు, మేధావులు ఎక్కువగా ఈ జాబితాలో ఉండటం గమనార్హం. ప్రపంచంలోనే అత్యధిక పౌరులను కోల్పోతున్న దేశాల్లో భారత్ టాప్‌లో కొనసాగుతోంది.