News October 17, 2024
తెలంగాణ పత్తి రైతులపై ఎందుకీ వివక్ష?: హరీశ్ రావు

TG: గుజరాత్ పత్తికి మద్దతు ధరగా క్వింటాకు ₹8,257 చెల్లిస్తున్న కేంద్రం.. తెలంగాణ పత్తికి ₹7,521 మాత్రమే ఇవ్వడం దుర్మార్గమని హరీశ్రావు మండిపడ్డారు. రాష్ట్ర రైతులపై ఎందుకీ వివక్ష అని ప్రశ్నించారు. ‘వన్ నేషన్-వన్ ట్యాక్స్, వన్ ఎలక్షన్, వన్ రేషన్ కార్డ్, వన్ మార్కెట్ అని ఊదరగొట్టే కేంద్రం వన్ నేషన్- వన్ MSP ఎందుకు ఇవ్వట్లేదు. ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఎందుకుంది?’ అని Xలో నిలదీశారు.
Similar News
News December 26, 2025
చెలరేగిన బౌలర్లు.. లంక 112 రన్స్కే పరిమితం

శ్రీలంక ఉమెన్స్తో జరుగుతున్న మూడో టీ20లో భారత బౌలర్లు అదరగొట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లంకను 20 ఓవర్లలో 112/7 పరుగులకే పరిమితం చేశారు. రేణుకా ఠాకూర్ 4, దీప్తీ శర్మ 3 వికెట్లతో చెలరేగారు. లంక బ్యాటర్లలో దులానీ 27, పెరీరా 25, దిల్హరీ 20, నుత్యాంగన 19 మినహా మిగతావారంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు.
News December 26, 2025
నీటి పొదుపుతో ఆర్థిక వృద్ధి

ప్రవహించే నీరు సంపదకు చిహ్నమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ఇంట్లో కుళాయిలు కారుతూ నీరు వృథా కావడమంటే లక్ష్మీదేవి అనుగ్రహం క్రమంగా హరించుకుపోవడమే అని అంటున్నారు. ‘నీటి వృథా ప్రతికూల శక్తిని పెంచి మనశ్శాంతిని దూరం చేస్తుంది. అదనపు ఖర్చును పెంచుతుంది. కారుతున్న కుళాయిలను వెంటనే బాగు చేయిస్తే ఇంట్లో సానుకూలత ఏర్పడుతుంది. నీటిని గౌరవిస్తే సంపదను కాపాడుకోవచ్చు’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 26, 2025
‘రాజాసాబ్’ నుంచి మాళవిక లుక్ రిలీజ్

ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి హీరోయిన్ మాళవికా మోహనన్ ‘భైరవి’ లుక్ను మేకర్స్ విడుదల చేశారు. కొన్ని గంటల క్రితం మాళవిక Xలో ‘AskMalavika’ నిర్వహించారు. చాలామంది ఫ్యాన్స్ ‘మూవీలో మీ లుక్ను ఎందుకు ఇంకా రివీల్ చేయడంలేదు’ అని ప్రశ్నించారు. ఆమె నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీని ట్యాగ్ చేస్తూ ఇదే క్వశ్చన్ అడగడంతో పోస్టర్ విడుదల చేసింది. JAN 9న విడుదలయ్యే రాజాసాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్ HYDలో రేపు జరగనుంది.


