News September 22, 2025

మహిళలు కాళ్లకు పసుపు ఎందుకు రాస్తారంటే..

image

పసుపు రాసుకోవడానికి సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ఆరోగ్యకారణాలున్నాయి. దీన్ని పూజల్లో, ఆహారంలో వాడటంతో పాటు ప్రత్యేక పర్వదినాల్లో కాళ్లకు, ముఖానికి రాసుకుంటారు. దీనివెనక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. పసుపు చర్మాన్ని మెరిసేలా చేయడంతో పాటు గాయాలను మాన్పిస్తుంది. మహిళలు నీటిలో పనిచేయడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు, కాళ్లనొప్పులు, వాపులను పసుపు నిరోధిస్తుంది. అందుకే మహిళలు దీన్ని రాసుకుంటారు.

Similar News

News September 22, 2025

₹500 కోట్లతో NTTPS కాలుష్య నివారణ పనులు

image

AP: NTTPS కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. పొల్యూషన్ రాకుండా ప్లాంటులో ₹500కోట్లతో పరికరాలు సమకూరుస్తున్నామన్నారు. ’పాండ్‌యాష్ నిల్వ, తరలింపుతోనే ఈ సమస్య. కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు, యాష్ రవాణాకు టెండరింగ్ ఏజెన్సీని నియమించాం. ఏజెన్సీ ఏర్పాటుపై అపోహలొద్దు.’ అని పేర్కొన్నారు. స్థానికుల ఉపాధి దృష్ట్యా ఉచితంగా బూడిద లోడింగ్‌‌, రవాణా ఖర్చులు అందిస్తున్నామన్నారు.

News September 22, 2025

రాష్ట్రంలో 42 పోస్టులు.. దరఖాస్తుల సవరణకు కొన్ని గంటలే ఛాన్స్

image

<>ఏపీలో<<>> 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు దరఖాస్తులో తప్పుగా నమోదు చేశారా? అలాంటి వారికి ముఖ్య గమనిక. తప్పుల సవరణకు ఇవాళ సాయంత్రం 5గంటల వరకు అవకాశం ఉంది. వివరాలు తప్పుగా నమోదు చేసినవారు సవరణ చేసుకోవచ్చని పోలీస్ నియామక మండలి తెలిపింది. ఈ పోస్టులకు సెప్టెంబర్ 7వరకు దరఖాస్తులను స్వీకరించింది.

News September 22, 2025

భర్తలను కాపాడుకున్న భార్యలు!

image

భర్త ప్రాణాల్ని కాపాడుకొనేందుకు భార్య చూపే ప్రేమ, త్యాగాలకు సరిహద్దులు లేవని ఈ ఘటన మరోసారి నిరూపించింది. నవీ ముంబైలో ప్రాణాంతక వ్యాధితో ఇద్దరు భర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆపరేషన్ చేద్దామంటే కుటుంబీకుల రక్తం మ్యాచ్ అవ్వకపోవడంతో ఒకరి భర్త కోసం మరొకరు లివర్‌ను దానం చేసి వారి ప్రాణాలు కాపాడారు. ఆపరేషన్ విజయవంతమై నలుగురూ క్షేమంగా ఉన్నారు. భార్యల త్యాగాన్ని నెటిజన్లు ప్రశంసింస్తున్నారు.