News September 24, 2024
ఆల్కహాల్ సేవించాక ఇంగ్లిష్లో ఎందుకు మాట్లాడతారు?
ఈ విషయాన్ని ఎప్పుడైనా గమనించారా? ఇలాంటివి మీకు తెలిసిన వారిలో ఎవరో ఒకరు చేసుంటారు. అయితే, దీని వెనుక సైన్స్ ఉందని సైకోఫార్మాకాలజీ జర్నల్లో ప్రచురించారు. ‘మద్యం మత్తులో ఉన్న వ్యక్తి మాతృభాష కంటే కూడా రెండో భాష, ప్రత్యేకించి ఇంగ్లిష్లో మాట్లాడుతుంటారు. దానిపైనే తక్కువ పట్టు ఉందనే ఆందోళనను దరిచేరనీయరు. అదేవ్యక్తి మత్తు తగ్గాక ఇంగ్లిష్లో మాట్లాడేందుకు సంకోచిస్తారు’ అని జర్నల్లో ఉంది.
Similar News
News September 24, 2024
జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్.. రేపు తీర్పు
జానీ మాస్టర్ను పోలీసు కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. దీనిపై రంగారెడ్డి కోర్టు రేపు తీర్పును వెల్లడించనుంది. మరోవైపు బెయిల్ పిటిషన్పై వాదనలు రేపు కూడా కొనసాగనున్నాయి. అసిస్టెంట్ డాన్సర్పై అత్యాచార కేసులో అరెస్టైన జానీ మాస్టర్ ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
News September 24, 2024
దమ్ముంటే వారిపై చర్యలు తీసుకోండి: కేటీఆర్
TG: హైడ్రా పేరుతో పేదల బతుకులను ప్రభుత్వం రోడ్డుపై వేస్తుందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే నిర్మాణ అనుమతులు ఇచ్చినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో అక్రమంగా అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్సే అని ఆరోపించారు. పేదల ఇళ్లు కూలిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
News September 24, 2024
మహిళా కమిషన్ ఛైర్పర్సన్ లక్ష్మికి ఉద్వాసన
AP: రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ గజ్జల వెంకట లక్ష్మికి ప్రభుత్వం ఉద్వాసన పలికింది. ఆమెను వెంటనే బాధ్యతల నుంచి తప్పిస్తూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి ఆమెకు నోటీసులు జారీ చేశారు. కాగా వెంకట లక్ష్మిని వైసీపీ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే.