News March 21, 2024
మెదడులో రక్తస్రావం ఎందుకు జరుగుతుందంటే..

మెదడులో రక్తస్రావం కారణంగా జగ్గీ వాసుదేవ్కు బ్రెయిన్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఇది బ్రెయిన్ స్ట్రోక్ వలనే తలెత్తిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘మెదడు కణాలకు అందాల్సిన ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వలన రక్తం సరఫరా నిలిచిపోవడమే బ్రెయిన్ స్ట్రోక్. తీవ్రంగా తలనొప్పి, ముఖం ఓవైపునకు వంగడం, చేతులపై నియంత్రణ లేకపోవడం, తిమ్మిర్లు వంటి లక్షణాలుంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి’ అని సూచిస్తున్నారు.
Similar News
News February 2, 2026
IAFలో అగ్నివీర్ వాయు పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అగ్నివీర్ వాయు పోస్టులకు అప్లై చేయడానికి గడువును పొడిగించారు. FEB 1 తేదీ ఆఖరు తేదీ కాగా.. FEB 8 వరకు పెంచారు. డిప్లొమా, ఇంటర్, టెన్త్ అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు జనవరి 1, 2006-జులై1, 2009 మధ్య జన్మించి ఉండాలి. రాత పరీక్ష, PFT, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎత్తు 152సెం.మీ. ఉండాలి. సైట్: https://iafrecruitment.edcil.co.in
News February 2, 2026
రాహుల్ కామెంట్లతో LSలో దుమారం

రాహుల్ గాంధీ కామెంట్లతో LSలో గందరగోళం తలెత్తింది. చైనా సైన్యం భారత సరిహద్దుల్లోకి చొరబడుతోందని ఆరోపిస్తూ మాజీ ఆర్మీ చీఫ్ నరవణె ఇంకా ప్రచురించని బుక్లోని అంశమే ఆధారమన్నారు. దీనిపై కేంద్రమంత్రులు రాజ్నాథ్, షా తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇంకా ప్రచురించని పుస్తకంలోని అంశాలపై ఎలా మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చెప్పింది వందశాతం నిజమని, దేశభక్తి ఎవరికి ఉందో తెలుసని రాహుల్ స్పష్టం చేశారు.
News February 2, 2026
భారత వ్యూహానికి సైంధవుడిలా అడ్డుపడ్డ ట్రంప్!

ఇరాన్లో భారత్ వ్యూహాత్మకంగా చేపట్టిన <<19028102>>చాబహార్<<>> ప్రాజెక్టు కలలకు US అధ్యక్షుడు ట్రంప్ సైంధవుడిలా అడ్డుపడుతున్నారు. ఆ పోర్టుపై భారత్ దాదాపు ₹1000కోట్లు ఖర్చు చేసింది. 2025 SEPలో ట్రంప్ ఈ పోర్టుపై ఆంక్షలు విధించడం, తాజాగా ఇరాన్తో కయ్యానికి కాలు దువ్వుతుండటం భారత కలలకు బీటలు వేసినట్లు అయింది. భారత్ వెనక్కి తగ్గడంతో చైనాకు మిడిల్ ఈస్ట్పై పట్టుపెంచుకునే అవకాశాలు పెరిగాయని విశ్లేషకులు చెబుతున్నారు.


