News January 8, 2025

ఆరోగ్యశ్రీపై చంద్రబాబుకు ఎందుకు అంత కక్ష?: వైఎస్ జగన్

image

AP: ఆరోగ్యశ్రీపై సీఎంకు ఎందుకంత కక్ష అంటూ మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. ‘వైద్యానికి ఎంత ఖర్చైనా ప్రజలు ఉచితంగా చికిత్స పొందేలా పథకాన్ని తీర్చిదిద్దాం. దాన్ని కూటమి ప్రభుత్వం ఎందుకు నాశనం చేస్తోంది? నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.3వేల కోట్లు బకాయిలు పెట్టారు. కోటిన్నర కుటుంబాల ఆరోగ్యానికి షూరిటీ లేదు. మీ చర్యల్ని ఖండిస్తున్నా. ఆరోగ్యశ్రీని వెంటనే యథాతథంగా అమలు చేయాలి’ అని డిమాండ్ చేశారు.

Similar News

News December 14, 2025

జనవరి 2 నుంచి విజయవాడలో బుక్ ఫెస్టివల్

image

AP: రాష్ట్రంలో పుస్తక సంబరాలకు ముహూర్తం ఖరారైంది. వచ్చే జనవరి 2 నుంచి 11 రోజులపాటు విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో 36వ బుక్ ఫెస్టివల్ జరగనుంది. రోజూ 6PMకు సందర్శన మొదలవుతుంది. లక్షలాది పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. డైలీ సాహిత్య సదస్సులు, పుస్తకావిష్కరణలు ఉంటాయి. కార్యక్రమ ప్రారంభానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ను నిర్వాహకులు ఆహ్వానించారు. తాజాగా పుస్తక ప్రదర్శన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

News December 14, 2025

ఆదివారం ఏం కొనాలి? ఏం కొనకూడదు?

image

ఆదివారం ఇంటి నిర్మాణ వస్తువులు, గార్డెనింగ్ సామాగ్రి, ఇనుము, ఫర్నిచర్, హార్డ్‌వేర్, వాహన వస్తువులను కొనుగోలు చేయకూడదని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఆర్థిక నష్టానికి, పేదరికానికి దారితీస్తుందని చెబుతున్నారు. అయితే కంటికి సంబంధించిన వస్తువులు, గోధుమలు, రాగి, ఎరుపు రంగు వస్తువులు కొనడం మాత్రం శుభప్రదమని అంటున్నారు. ఇది ఆర్థిక ఎదుగుదలకు, సూర్యుడి అనుగ్రహానికి దోహదపడుతుందని వివరిస్తున్నారు.

News December 14, 2025

మూడేళ్లలో 17 లక్షల ఇళ్లు నిర్మిస్తాం: వివేక్

image

TG: రాబోయే మూడేళ్లలో 17 లక్షల ఇళ్లు నిర్మిస్తామని మంత్రి వివేక్ తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేరుస్తామన్నారు. వికారాబాద్‌లోని నస్కల్‌లో ATC శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడారు. యువతకు సరైన ఉద్యోగాలు రావాలంటే స్కిల్ తప్పనిసరని చెప్పారు. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టకపోగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించలేదని విమర్శించారు. త్వరలోనే తమ ప్రభుత్వం మరో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తుందని పేర్కొన్నారు.