News October 24, 2024
అవినాశ్ రెడ్డిని విమర్శిస్తున్నారని కేసు పెట్టడం ఏంటి జగన్?: TDP

AP: అవినాశ్ రెడ్డిని విమర్శించడం మానేస్తేనే షర్మిలకు ఆస్తి రాసిస్తానంటూ YS జగన్ బ్లాక్మెయిల్ చేశారని TDP ట్వీట్ చేసింది. ‘నీ గురించి రాజకీయంగా విమర్శించవద్దని అన్నావు ఓకే. కానీ మధ్యలో అవినాశ్ ఎందుకు వచ్చాడు? అవినాశ్ను విమర్శిస్తున్నారని సొంత తల్లి, చెల్లిపై కేసు పెట్టడం ఏంటి? బాబాయ్ హత్యలో నిందితుడైన అతని గురించి మాట్లాడితే నీ ఇంటి నుంచి జరిగిన హత్య మంత్రాంగం బయటపడుతుందని భయమా?’ అని పేర్కొంది.
Similar News
News March 17, 2025
భద్రత పెంచుతాం.. డీకే అరుణకు సీఎం హామీ

TG: బీజేపీ ఎంపీ డీకే అరుణ <<15780375>>ఇంట్లో ఆగంతకుడు<<>> ప్రవేశించిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఎంపీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. భద్రత పెంచుతామని ఆమెకు హామీకి ఇచ్చారు. ఈ ఘటనలో విచారణ వేగవంతం చేసి వాస్తవాలు తేల్చాలని పోలీసులను సీఎం ఆదేశించారు. భద్రత పెంచాలని పోలీస్ శాఖకు సూచించారు.
News March 17, 2025
GOLD: ప్రాఫిట్ బుకింగ్ టైమ్ వచ్చేసిందా!

చివరి మూడేళ్లలో ఏటా బంగారం 17% రాబడి అందించింది. ఔన్స్ రేటు $3000ను తాకడంతో ప్రాఫిట్ బుక్ చేసుకోవడంపై ఇన్వెస్టర్లు సందిగ్ధంలో పడ్డారు. Sensex to Gold రేషియోను బట్టి నిర్ణయించుకోవడం బెటర్ అంటున్నారు Edelweiss SVP నిరంజన్ అవస్థి. 1999 నుంచి ఈ రేషియో 1కి దిగువన ఉంటే తర్వాతి మూడేళ్లలో ఈక్విటీస్, 1 కన్నా ఎక్కువుంటే తర్వాతి మూడేళ్లలో గోల్డ్ రాణిస్తోంది. ప్రస్తుతమిది లాంగ్టర్మ్ సగటు 0.96కు దిగువన ఉంది.
News March 17, 2025
మరోసారి సంక్రాంతికి అనిల్ రావిపూడి మూవీ

మెగాస్టార్ చిరంజీవి సినిమాతో 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. సింహాచలం లక్ష్మీ నరసింహస్వామివారిని ఆయన దర్శించుకున్నారు. మెగాస్టార్తో తీయబోయే మూవీ స్క్రిప్ట్ స్వామి సన్నిధిలో పెట్టి పూజలు నిర్వహించారు. సినిమా కథలకు వైజాగ్ను తాను సెంటిమెంట్గా భావిస్తానని చెప్పారు. ఆయన తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే.