News October 22, 2025

కార్తీక మాసంలో విష్ణుమూర్తికీ ప్రాధాన్యమెందుకు?

image

కార్తీక మాసానికి హరిహరుల మాసమని పేరుంది. ఈ నెలలో చతుర్దశి తిథిని వైకుంఠ చతుర్దశిగా పిలుస్తారు. ఆ రోజున నారాయణుడు వైకుంఠాన్ని వీడి వారణాసి కాశీ విశ్వనాథుడిని అర్చిస్తాడని పురాణాల్లో ఉంది. అలాగే విష్ణువు రామావతారం దాల్చినప్పుడు శివుడే ఆంజనేయుడిగా అవతరించి సహకరించాడని ప్రతీతి. హరిహరులిద్దరూ కలిసి జలంధరుడిని అంతం చేశారు. అందుకే ఈ మాసంలో భేదాలు లేకుండా శివుడిని, విష్ణుమూర్తినీ పూజించాలి.

Similar News

News February 6, 2026

క్వాంటం వ్యాలీకి రేపే శంకుస్థాపన

image

AP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న క్వాంటం వ్యాలీ నిర్మాణానికి రేపు శంకుస్థాపన జరగనుంది. అమరావతిలోని ఉద్దండరాయునిపాలెంలో 2.30PMకు సీఎం చంద్రబాబు భూమి పూజ చేస్తారు. తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రైతులు, విద్యార్థులతో ముచ్చటిస్తారు. కాగా ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 50 ఎకరాల భూమిని కేటాయించింది. ఇప్పటికే క్వాంటం శిక్షణ కోసం 50వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు.

News February 6, 2026

శుక్ర దోష నివారణ మార్గాలు

image

శుక్ర దోష నివారణ కోసం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించాలి. లలితా సహస్రనామ పఠనం చేయాలి. తెల్లని వస్తువులు దానం చేస్తే శుభం కలుగుతుంది. పాలు, పెరుగు, బియ్యం, పంచదార, తెలుపు వస్త్రాలు పేదలకు దానం చేయాలి. ‘ఓం శుం శుక్రాయ నమః’ అనే మంత్రాన్ని జపిస్తే శుక్రుని అనుగ్రహం లభిస్తుంది. శుక్రవారం రోజున ఉపవాసం ఉండటం, తెలుపు దుస్తులు ధరించడం మంచిది. సుగంధ ద్రవ్యాలు వాడితే శుక్రుడు ప్రసన్నమవుతాడని నమ్మకం.

News February 6, 2026

పచ్చి పేడను నేరుగా పొలంలో వేస్తున్నారా?

image

పశువుల పేడను సరైన విధానంలో వాడితే పంటకు మేలు చేస్తుంది. అయితే చాలా మంది రైతులు పచ్చి పశువుల పేడను నేరుగా పొలంలో చల్లుతుంటారు. దీని వల్ల పంటకు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందంటున్నారు నిపుణులు. పచ్చి పేడలో ఉండే నులిపురుగులు మొక్క వేర్లను ఆశించి పంటను దెబ్బతీస్తాయి. అందుకే పేడను మగ్గబెట్టి వాడటం మంచిదని చెబుతున్నారు. దీని వల్ల భూసారం పెరగడంతో పాటు పంట దిగుబడి కూడా బాగుంటుందని చెబుతున్నారు.