News April 9, 2025

ట్రంప్ టారిఫ్స్‌పై మోదీ మౌనం ఎందుకు?: రాహుల్

image

US టారిఫ్స్‌తో భారత ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం జరుగుతుందని రాహుల్ గాంధీ అన్నారు. ట్రంప్ టారిఫ్స్ విధిస్తుంటే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. “ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ఒక్కొక్కటిగా విక్రయిస్తున్నారు. అంబానీ, అదానీలకు దోచిపెడుతున్నారు. RSS, BJP రెండూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయి. క్రైస్తవుల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని RSS పత్రిక ‘ఆర్గనైజర్’లో రాస్తున్నారు” అని పేర్కొన్నారు.

Similar News

News April 18, 2025

తరచూ జలుబు వేధిస్తోందా?

image

సీజన్లతో సంబంధం లేకుండా కొందరిని తరచూ జలుబు వేధిస్తుంటుంది. దీనికి శరీరంలో అయోడిన్ లోపం కారణమై ఉండొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరికొందరిలో మాటిమాటికీ వచ్చే ఆవలింతలకు కారణం ఐరన్ లోపం అని అంటున్నారు. అలాగే, కాళ్లు, చేతుల కండరాల్లో రెగ్యులర్‌గా నొప్పులు వస్తుంటే శరీరంలో మెగ్నీషియం తక్కువైందని గుర్తించాలంటున్నారు. వెన్ను, కాళ్ల నొప్పులొస్తే విటమిన్-D టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు.

News April 18, 2025

? ప్లేస్‌లో ఉండాల్సిన నంబర్ ఏంటి?

image

పై ఫొటోలో ఉన్న రీజనింగ్ క్వశ్చన్‌ చూశారు కదా! చిన్న లాజిక్ ఉపయోగిస్తే దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ? ప్లేస్‌లో ఉండాల్సిన నంబర్ ఏంటో కనుగొంటే COMMENT చేయండి.

News April 18, 2025

తిరుమలలో TTD ఛైర్మన్ ఆకస్మిక తనిఖీలు

image

AP: తిరుమలలో TTD ఛైర్మన్ BR నాయుడు ఆకస్మిక తనిఖీలు చేశారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తులతో మాట్లాడి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అని అడిగి తెలుసుకున్నారు. TTD సాంకేతిక సేవల్లో కొన్ని లోపాలను ఓ భక్తుడు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు లడ్డూ, అన్నప్రసాదాలు రుచికరంగా ఉన్నాయని కొందరు తెలిపారు. అటు, దర్శన క్యూలైన్లనూ ఆయన పరిశీలించి.. భక్తులతో మర్యాదగా, సేవాభావంతో ప్రవర్తించాలని సిబ్బందిని ఆదేశించారు.

error: Content is protected !!