News September 6, 2024
పీసీసీ చీఫ్ పదవి మహేశ్కే ఎందుకంటే?

TG: TPCC చీఫ్గా మహేశ్ కుమార్ గౌడ్ను AICC నియమించింది. ఎంతో మంది BC నేతలు ఈ పదవి కోసం పోటీపడినా ఆయనకే దక్కింది. ముఖ్యంగా BC సామాజికవర్గం నుంచి మధుయాష్కీ గౌడ్ ఢిల్లీ స్థాయిలోనూ లాబీయింగ్ చేసినా ఆయనను పట్టించుకోలేదు. వ్యతిరేకత లేకపోవడం, గత ఎన్నికల్లో సీటు త్యాగం చేయడం, పార్టీ కార్యక్రమాలు చురుగ్గా నిర్వహించడం, రేవంత్, ఉత్తమ్, భట్టి విక్రమార్కతో సన్నిహిత సంబంధాలు ఉండడమే ఆయనకు కలిసి వచ్చింది.
Similar News
News November 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 77

ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా అడగడానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 25, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు

ఇస్రో-<
News November 25, 2025
అధిక సాంద్రత పత్తిసాగు – ఎందుకు ప్రత్యేకం?

ఈ విధానంలో సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య దూరం తగ్గించి ఎకరాకు వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలి. సాధారణ పత్తి సాగులో వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 60 సెంమీ. ఎడం ఉండేలా నాటాలి. అధిక సాంద్రత పద్ధతిలో వరుసల మధ్య 80 సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ (లేదా) వరుసల మధ్య 90 సెం.మీ, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటాలి. దీంతో ఎకరం విస్తీర్ణంలో ఎక్కువ మొక్కల వల్ల దిగుబడి బాగా పెరుగుతుంది.


