News July 15, 2024

Xiaomi క్రేజ్ ఎందుకు తగ్గిందంటే? – 1/2

image

ఒకప్పుడు భారత‌ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఏలిన చైనా కంపెనీ Xiaomiకి ఇప్పుడు క్రేజ్ తగ్గిపోవడం చర్చనీయాంశమైంది. 2022 క్యూ1లో గరిష్ఠంగా 23% మార్కెట్ షేర్ సంపాదించుకున్న షావోమీ ఈ ఏడాది Q1లో 12.8%కు పరిమితమైంది. బడ్జెట్ ఫోన్లకు కేరాఫ్ అని సంస్థకు వచ్చిన గుర్తింపే సేల్స్‌ను దెబ్బతీసిందని విశ్లేషకులు చెబుతున్నారు. ₹10వేల-15వేలు, ₹10వేలలోపు రేంజ్ ఫోన్లపైనే సంస్థ ఫోకస్ చేయడం ప్రభావం చూపిందంటున్నారు.

Similar News

News December 26, 2025

జాతకం లేకపోతే ఎలా?

image

జాతకం లేకపోయినా కొన్ని శక్తివంతమైన పారాయణల దోషాలను అడ్డుకుంటాయి. ఆరోగ్యం కోసం ఆదిత్య హృదయం, ఆర్థిక కష్టాలకు విష్ణు సహస్రనామం, అప్పుల విముక్తికి అంగారక స్తోత్రం పఠించాలి. వివాహ ప్రాప్తికి రుక్మిణి కల్యాణం, సంతానం కోసం సంతాన గోపాల వ్రతం పనిచేస్తాయి. నిత్యం హనుమాన్ చాలీసా పఠిస్తే సకల విజయాలు కలుగుతాయి. గాయత్రీ మంత్రం జపించడం, దానాలు చేయడం జాతక దోషాలను తొలగించి శుభ ఫలితాలను ఇస్తాయని శాస్త్ర వచనం.

News December 26, 2025

APPLY NOW: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

image

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 14 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, ఇంటర్, డిప్లొమా(ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్/రేడియో ఇంజినీరింగ్/ మెకానికల్/ఫైర్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు JAN 11వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. CBT, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. https://www.aai.aero/

News December 26, 2025

‘రుషికొండ’ను TTDకి అప్పగించాలి: BJP MLA

image

AP: విశాఖపట్నం రుషికొండ భవనాలను, కింద ఉన్న మరికొంత భూమిని ప్రముఖ హోటళ్లకు కేటాయించేలా ఇటీవల మంత్రుల కమిటీ చర్చించడం తెలిసిందే. ఈనెల 28న తుది నిర్ణయం తీసుకోనుంది. కాగా BJP MLA విష్ణు కుమార్ రాజు దీనిపై స్పందిస్తూ స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. ‘రుషికొండను ఆదాయవనరుగా చూడొద్దు. హోటళ్లకు ఇస్తే సామాన్యులకు దూరం అవుతుంది. TTDకి అప్పగించి ఆధ్యాత్మిక సిటీగా మార్చాలి’ అని కోరారు.